Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘రాధేశ్యామ్’. భారీ స్థాయిలో ఈ మార్చి 11న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింప వుతోంది. బెనిఫిట్ షో ఎప్పుడు చూస్తామా? అనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో మాత్రమే కాదు అందరిలోనూ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు కౌంట్ డౌన్ గంటల్లో మొదలవ్వడంతో ఎగ్జైట్ మెంట్ తట్టుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో అభిమానుల నుంచి దర్శక, నిర్మాతలకు తీవ్రమైన ఒత్తిడి కూడా ఎదురవుతుందట.
ఇప్పటికే ఈ సినిమా విషయంలో నిర్మాతలు చాలా ట్రోల్స్ ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఏకంగా కొందరు అభిమానులు నేరుగా లెటర్ రాయడం..ఓ అభిమాని సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం ఇప్పటికే జరిగిపోయాయి. అయితే ఇప్పుడు అభిమానుల నుంచి మేకర్స్కు కొత్త డిమాండ్ ఎదురైందట. విదేశాలలో మాదిరిగా ‘రాధేశ్యామ్’ చిత్రాని కి ఒకరోజు ముందుగానే పేయిడ్ ప్రీమియర్స్ వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారట. అమెరికాలో ఇలా ఒకరోజు ముందు సినిమా రిలీజ్ అవుతుంది. అయితే మనకి అక్కడికి కొన్ని గంటల తేడా ఉండటంతో ఇది ఏమాత్రం ప్రభావం చూపించదు.
Prabhas: ఫైనల్గా ఏం డిసైడ్ అవుతారో.
కానీ, అక్కడ మాదిరిగా ఒకరోజు ముందే అంటే 10వ తేదీనే ‘రాధేశ్యామ్’ పేయిడ్ ప్రీమియర్స్ వేయాలని అభిమానులు కోరడం బాగానే ఉన్నా..అది సినిమాకు పెద్ద మైనస్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది నిజమే. రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా. హిట్ టాక్ వస్తేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రేకీవెన్ టార్గెట్ రీచవడం కష్టం. అలాంటిది డివైడ్ టాక్ వస్తే మాత్రం ఇక నిర్మాత కోలుకో లేడు. అందుకే, అభిమానులు ఒత్తిడి చేస్తున్నా ‘రాధేశ్యామ్’ మేకర్స్ ఒకరోజు ముందు ఇండియాలో ప్రీమియర్స్ వేసేందుకు ధైర్యం చేయడం లేదని తెలుస్తోంది. చూడాలి మరి ఫైనల్గా ఏం డిసైడ్ అవుతారో.