దేవాలయం అంటే మనకు అత్యంత పవిత్రమైన స్థలం. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమాత్ముడు కొలువై ఉంటాడని విశ్వసిస్తాం. అందుకే ఆయన కొలువైన ప్రదేశం కాబట్టే కోవెల అని కూడా దేవాయలయాన్ని పిలుస్తారు. అయితే దేవాలయానికి మాంసం తిన్న తర్వాత వెళ్లవచ్చా ? దీనిపై పండితుల మాట ఏంటో తెలుసుకుందాం..
మానవుడి ప్రవర్తన మనం తినే ఆహారం పై ఆధార పడి ఉంటుంది అని పరిశోధనలు చెబుతున్నాయి. మాంసాహారం తమో గుణాన్ని పెంచుతుంది. అలాగే శాకాహారం అయిన ఉల్లిపాయలు కూడా తమోగుణాన్ని పెంచుతాయి. మాంసాహారం తిన్న తరువాత దైవ దర్శనం చేసుకో కూడదు అని ఎక్కడా చెప్పలేదు.. కానీ ఒక పవిత్ర భావనతో దైవ దర్శనం చేసుకుందాం.. అని అనుకున్న వారు మాంసాహారం తీసుకోకుండా దైవ దర్శనం చేసుకోవడం మంచిది. అసలు ఏ ఆహారం స్వీకరించకుండా (మాంసాహారం / శాకాహారం ) దైవ దర్శనం చేసుకోవడం చాల మంచిది. పరిగడుపున ప్రాతఃకాలంలో దైవదర్శనం ఉత్తమం. అయితే శివాలయం, నరసింహస్వామి తదితర ఆలయాలను అపుపడప్పుడు సాయంత్రం వేళలో వెళ్లాల్సి వస్తుంది ఈ సమయంలో సాధ్యమైనంత వరకు మిత ఆహారం, సాత్వికాహారం, పండ్లు, పాలు తీసుకుని వెళ్లడం మంచిది. మనం భక్తితో వెళ్లాలి. అక్కడ మన ధ్యాస అంతా పరమాత్ముడిపై నిలపాలి. దీనికోసం మాంసాహారం, మధ్యం, గుట్కాలు, వక్కపొడి తదితర మత్తు, రజో, తమోగుణ పదర్థాలను మన పెద్దలు నిషేధించారు.