ఇంతకాలం జనం చూసిన నాయకులు అధికంగా… ఏ ఆలోచన చేసినా అందులో మెజారిటీ భాగం ఓటు బ్యాంక్ దిశగా ఉండేది అనడంలో సందేహం ఉండకపోవచ్చు! లేదంటే స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇంకా అభివృద్ధి చెందుతూ……… ఉన్న దేశంగానే ఎందుకుంటుంది! ఆ సంగతి కాసేపు పక్కనపెడితే… గత ఏడాదిగా జగన్ పాలన చూస్తున్నవారు మాత్రం.. జగన్ ఏ పనిచేసినా సామాన్య జన జీవితాలను అర్ధంచేసుకునే చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కరోనా సమయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు! రోడ్లపై ఉండే బిక్షగాళ్ల ఆరోగ్యం గురించి సైతం ఆలోచించే దృక్పథం జగన్ సొంతం! ఆ సంగతులు అలా ఉంటే… శ్రీవారి సేవలో తరిస్తున్న టీటీడీ ఉద్యోగులకు తనవంతు సేవ చేయాలని నిర్ణయించనున్నారట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్!
తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆలయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా లాక్ డౌన్ కారణంగా ఏకంగా మూడు నెలల పాటు భక్తులని దర్శనాలకి అనుమతించలేదు. అనంతరం సడలింపులు ఇవ్వడంతో తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు టీటీడీ సిబ్బంది సైతం కరోనా బారినపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు 140 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వగా… వారిలో ఇప్పటికే 70 మంది కోలుకుని హోం క్వారంటైన్ లో ఉన్నారు! ఇదేక్రమంలో 40 మంది అర్చకుల్లో 14 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది! ఈ సమయంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోబోతోందని వార్తలొస్తున్నాయి!
కరోనా రోజు రోజుకీ తీవ్రమవుతుండటంతో… 60 సంవత్సరాలు నిండిన అర్చకులకి విధుల నుండి సడలింపు ఇచ్చి.. వారి ఆరోగ్యం మొత్తం కుదురుకునేవరకూ పెయిడ్ లీవ్స్ సేంక్షన్ చేయాలనే ఆలోచనలో జగన్ సర్కార్ ఉందంట! ఇది నిజమైతే.. నిజంగా అభినందించాల్సిన విషయమనేది అందరిమాటగా ఉంది! కాబట్టి… ఇప్పటికైనా ఒప్పుకోవాలిగా “జగన్ నిర్ణయాలు, ఆలోచనలు ఎప్పుడూ సామాన్యుడి జీవితాన్ని చాలా బాగా చదివిన వ్యక్తి ఆలోచనలుగా ఉంటాయని చెప్పడానికి” అని జగన్ ఫ్యాన్స్ చెబుతున్నారు!