ప్రతీ ఒక్కరికి ధనం తప్పనిసరి. ఏ చిన్నపని కావాలన్న ధనం లేకుంటే అది జరుగని కాలం ఇది. అయితే దీన్ని సంపాదించడం, దాచుకోవడం రెండూ కష్టమే.
ఎంత సంపాదించినా చేతిలో ధనం ఉండదని కొందరి బాధ. ఇలాంటి అందరికీ ఈ చిన్న తంత్రం పాటిస్తే ధనం, ధాన్యం సమృద్ధిగా ఉంటాయని పెద్దల అనుభవ పాఠం. ఆ విశేషాలు తెలుసుకుందాం.. ఏ మాసంలోనైనా మొదటి గురువారం నాడు- నూలు దారానికి కుంకుమపువ్వు రంగు అంటించి, ఇంటి ముఖద్వారం బయట కట్టాలి.
ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఆశ్లేష నక్షత్ర సమయంలో మర్రిచెట్టు ఆకును తెచ్చి ధాన్యాగారంలో ఉంచాలి. దీనివల్ల ధాన్యాగారం నిండుగా ఉంటుంది. భరణి నక్షత్ర సమయంలో రావిచెట్టు రెమ్మను తెచ్చి ధాన్యాగారంలో ఉంచినా సమృద్ధి కలుగుతుంది. ఇక ఆలస్యమెందుకు మీకు పైన చెప్పిన ఏదైనా ఒక దాన్ని చేసి భక్తితో శ్రద్ధతో ఆచరించి ధనధాన్యాలను పొందండి.