తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు అయిన రమణదీక్షితులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విపరీతంగా ధ్వజమెత్తారు. తన పాలనలో చంద్రబాబు అన్యాయంగా 20 మందికి పైగా వంశపారంపర్య అర్చకులను వారి విధుల నుండి తొలగించారని అయితే హైకోర్టు వారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తొలగించిన అర్చకులు అందరినీ స్వామివారి సేవలో కి అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇక ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా వారందరినీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సేవలో తిరిగి చేరేందుకు అనుమతినిచ్చారు. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఈఓ మరియు ఏఈఓ మాత్రం ఇంకా చంద్రబాబు మాటకే కట్టుబడి ఉండి కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క సూచనలను లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారని ప్రధానార్చకులు రమణదీక్షితులు ఆరోపించారు.
మరి తమ తాతల నాటి నుండి అర్చకులుగా శ్రీవారి సేవలో ఉన్న వారిని తిరుమల తిరుపతి దేవస్థానం తిరిగి ఎప్పటికి మరలా అర్చకులుగా చేర్చుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.