అందరికీ ధనం తప్పనిసరిగా కావాలి. కానీ ఎంత కష్టపడ్డా ఆ ధనం అనేది నిలబడక అనేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే ధనం నిలబడటానికి, లక్ష్మీదేవి అనుగ్రహానికి కొన్ని పరిహారాలు, తంత్రాలను చేస్తే మంచి ఫలితం వస్తుందని అనుభవజ్ఞుల అభిప్రాయం. ఆయా పరిహారాలను తెలుసుకుందాం…
ఇంట్లో కి ధనం, మనశ్శాంతి అన్నీ రావాలంటేఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీ దేవికి నచ్చేట్టు ఉండాలట. అంటే శుచి, శుభ్రం, పసుపు, కుంకుమ బొట్టులతో ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవీకి ప్రీతికరమని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉండాలి. పొద్దున్నే చీపురుతో శుభ్రపర్చి, నీళ్ళు చల్లి ముగ్గు వేయాలి.ఇది తప్పనిసరిగా చెయ్యాల్సిన పని.
ఎందుకంటే స్మశానం ముందున ముగ్గు వెయ్యరు. కనుక ఇంటి ముందు శుభప్రదంగా ముగ్గు వెయ్యాలి. గుమ్మానికి ఇరుపక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే పువ్వులు ఉంచాలి.లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటుఇటూ పెడితే.. అవి రోజూ మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది.ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదోఒకరకం పువ్వులు పెడితే మంచిది. గురు, ఆదివారాలలో రెండుపక్కల రెండు నిమ్మకాయ ముక్కలను పెట్టడం చేస్తే దుష్టగ్రహ బాధలు పోతాయి.