అయోధ్య రామమందిర నిర్మాణ శంకుస్థాపన ఆగస్టు అభిజిత్ లగ్నంలో పూర్తయ్యింది. అయితే ఈ పూజకు ముందు ఆయన అయోధ్యలో ఏం చేశారు. మొదట ఎక్కడ పూజ చేశారో తెలుసుకుందాం…
ఉదయం 11.44 గంటలకు హనుమాన్ గఢీకి చేరుకున్న మోడీప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మోడీకి..యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ స్వాగతం పలికారు. అనంతరం హనుమాన్ స్వామిని దర్శించుకుని హారతి ఇచ్చారు. ఆలయం చుట్టూ ప్రదిక్షణలు చేశారు. అక్కడున్న నిర్వాహకులు మోడీకి తలపాగా ధరించారు. అనంతరం రామజన్మభూమి ప్రాంగణానికి బయలుదేరారు. మధ్యాహ్నం 12.44 గంటలకు రామాలయానికి భూమి పూజ చేయనున్నారు మోడీ. మోడీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న సందర్భంగా అయోధ్య సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
11.40 గంటలకు హనుమాన్ గఢీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ మూడు రోజుల నుంచి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గాలని, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ..వేద మంత్రాలు చదువుతున్నారు. మోడీ పసుపు కుర్తా మరియు తెలుపు ధోతీ ధరించి ఉన్నారు. హిందూ మతం ప్రకారం, ప్రార్థనల రంగులు రూపంలో కనిపించాయి. మెడలో హారము ధరించి విమానం ఎక్కారు. ఇలా ప్రధాని మొదట హనుమాన్గడీలో పూజ చేసి హనుమాన్ ఆశీస్సులు తీసుకున్నారు.