ముకేష్ అంబానీ.. ఈయన గురించి తెలియని వారు మన దేశంలో చాలా తక్కువ మందే ఉంటారని చెప్పవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్ను అగ్రపథంలో తీసుకెళ్తున్నారు. ఇప్పటికే ఎన్నో కొత్త కంపెనీలను స్థాపించారు. అంబానీకి చెందిన జియో ఈ మధ్య కాలంలో భారీగా అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను కూడా ఆకర్షించింది. ఇక ముకేష్ అంబానీ ముంబైలో ఉంటారన్న సంగతి కూడా తెలిసిందే. ఈయన ముంబైలోని తన అంతిలియా అనే నివాసంలో ఉంటారు. అయితే ముకేష్ అంబానీ నెల నెలా తన సెక్యూరిటీ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తారో తెలుసా..? ఆ విషయంపై ఓ లుక్కేద్దాం.
ముకేష్ అంబానీతోపాటు ఆయన కుటుంబానికి కేంద్రం జడ్ సెక్యూరిటీని కల్పిస్తోంది. 2013లో ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్టు గ్రూప్ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి జడ్ సెక్యూరిటీని కల్పిస్తున్నారు. ఇక ముకేష్, ఆయన కుటుంబాన్ని నిరంతరాయంగా 28 మంది కమాండోలు రక్షిస్తుంటారు. వారు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన కమాండోలు.
ఇక ముకేష్ అంబానీ తన ప్రొటెక్షన్కు గాను నెల నెలా రూ.15 లక్షలు చెల్లిస్తారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ గతంలో వెల్లడించింది. ప్రభుత్వం ఆయనకు జడ్ లెవల్ సెక్యూరిటీని కల్పించినా.. అందుకు అయ్యే మొత్తాన్ని మాత్రం ఆయన నెల నెలా చెల్లిస్తారు.