కలియుగం.. ప్రస్తుతం మనం ఉంటున్న కాలం. అయితే ఈ యుగపురుషుడు కలి. ఆ కలి ఉండటానికి పరీక్షిత్తు మహారాజు ఇచ్చిన స్థానాలు తెలుసుకుందాం..
జూదశాల, పాన ( మద్య ) శాలయందు, స్వేఛ్చావిహరిణులై ధర్మమునకు కట్టు బడక ఆచార భ్రష్టులైన మనుషులందు, జీవ హింస జరిగే టటువంటి ప్రదేశములయందు అని పరీక్షిత్తు చెప్పాడు. అది విని కలిపురుషుడు అయ్యా మీరు నాలుగుస్థానాలిచ్చారు. కానీ వాటయందు నేను నిలబడడానికి వీలుకలిగేటట్టు లేదు. (పరీక్షిత్తు పరిపాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్లరు కనుక ) నాకు ఇంకొక్క స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు.అందుకు పరీక్షిత్తు బంగారం ఇచ్చాను అన్నాడు. దీంతో అప్పటినుంచి కలి ఈ ఐదుస్థానాలలో ఉండి ధర్మం తప్పిన వారిని ఆశ్రయించి వారితో తప్పులు చేయిస్తూ పాపాల బారినపడవేస్తున్నాడు.