DJ Tillu: డీజే టిల్లు.. 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై కేవలం రూ. 8 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన డీజే టిల్లు.. ఫుల్ రన్ లో రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాతో సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ కూడా వచ్చింది.
ఈసారి మల్లిక్ రామ్ దర్శకుడిగా వ్యవహరించగా.. సిద్ధు జొన్నలగడ్డ స్వయంగా కథ, డైలాగ్స్ అందించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ను ఎస్. థమన్ అందించగా.. సౌండ్ట్రాక్ను శ్రీచరణ్ పాకాల మరియు రామ్ మిరియాల స్వరపరిచారు. సాధారణంగా సీక్వెల్ సినిమాలకు సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ. పెద్ద పెద్ద హీరోలు కూడా సీక్వెల్ సినిమాలు చేసి బొక్క బోర్లా పడ్డారు. కానీ డీజే టిల్లు మూవీకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రం మాత్రం తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ నటనా శైలి, డైలాగ్ డెలివరీ, అతను పలికించిన హావభావాలు, కామెడీ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ పిచ్చెక్కింది. టాక్ పాజిటివ్ గా ఉండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టిల్లు స్క్వేర్ విడుదలైన మూడు రోజుల్లోనే క్లీన్ హిట్ గా నిలిచి లాభాల భాట పట్టింది.
బాక్స్ ఆఫీస్ వద్ద వసూల్ వర్షం కురిపిస్తోంది విడుదలైన మూడు రోజుల్లోనే బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ గా నిలిచి లాభాల పాటు పట్టింది. టిల్లు స్క్వేర్ విజయంతో సిద్ధు జొన్నలగడ్డ టాలీవుడ్ టైర్-2 హీరోల జాబితాలో చేరిపోయాడు. ఇదిలా ఉంటే.. తాజాగా డీజే టిల్లు మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. డీజే టిల్లు మూవీలో హీరో క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ సిద్ధు జొన్నలగడ్డ కాదట. సిద్ధు కంటే ముందే టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ హీరో వద్దకు ఈ మూవీ స్టోరీ వెళ్లిందట. కానీ సదరు హీరో మాత్రం నో చెప్పాడట.
బంగారం లాంటి బ్లాక్ బస్టర్ మూవీని రిజెక్ట్ చేసిన ఆ అన్ లక్కీ హీరో మరెవరో కాదు టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మొదట డీజే టిల్లు చిత్రాన్ని విజయ్ దేవరకొండతో చేయాలని భావించారు. ఆయనకు కథను నెరేట్ చేయడం కూడా జరిగిందట. కానీ అప్పటికే ఆ తరహా బోల్డ్ కథలు చేసి ఉండటంతో.. డీజే టిల్లు స్టోరీ నచ్చినప్పటికీ విజయ్ దేవరకొండ సున్నితంగా రిజెక్ట్ చేశాడట. దాంతో హీరోగా సిద్ధు జొన్నలగడ్డను ఎంపిక చేశారు. ఈ చిత్రం సిద్ధు కెరీర్ కే టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. డీజే టిల్లు మరియు దానికి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రాలు సిద్ధు కు టాలీవుడ్ లో భారీ క్రేజ్ ఏర్పడేలా చేశాయి. ప్రస్తుతం ఈ యంగ్ స్టార్ తెలుగులో తెలుగు కదా మరియు జాన్ అనే రెండు క్రేజీ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.