Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ రెండో వారం ఆట కంప్లీట్ అయింది. అయితే ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లో ఉన్న ఏడుగురిలో షకీలా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించడం జరిగింది. మొదటివారం కంటే రెండో వారం గేమ్ చాలా రసవత్తరంగా సాగింది. ఈ క్రమంలో ఎవరు హెల్మెట్ అవుతారు అన్నది ఉత్కంఠ భరితంగా ఉన్న సమయంలో షకీలా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. షకీలా హౌస్ నుండి వెళ్తున్న సమయంలో . ఇంటి సభ్యులందరూ ఎమోషనల్ అయ్యారు. ఆ హౌస్ నుండి బయటకు వచ్చాక గీతు రాయల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంటి సభ్యుల మీద షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మోస్ట్ కండింగ్ గేమ్ ఆడుతున్నాడనీ షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది.
మొదటిరోజు హౌస్ లోకి చెప్పులు బయట విడిచి రావడం జరిగింది. తర్వాత హౌస్ లోకి చెప్పులు వేసుకుని లోనికి వచ్చాడు. నెక్స్ట్ రోజు చెప్పులేసుకుని కాలు మీద కాలేసుకుని కుర్చీలో కూర్చుని కాలు ఉపాడు. పాపులారిటీ అనే డ్రగ్ మాయలో పడి గేమ్ ఆడుతున్నాడు అంటూ పల్లవి ప్రశాంత్ పై షకీల సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఇదే రీతిలో ప్రిన్స్ ఎదవ అని తిట్టడం జరిగింది. బాడీతో గేమ్ ఆడే వద్దామనుకుంటున్నాడు బుర్రవాడట్లేదుగాని విమర్శించడం జరిగింది. ఇంకా రతిక మరికొందరిపై షకీలా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె ఎక్కువగా ఎదుటి వ్యక్తుల కళ్ళల్లో చూసి మాట్లాడలేదు. ఎందుకంటే దొరికిపోతుందని భయం ఆమెలో ఉంది.
ఇంకా శివాజీ గురించి షకీలా చాలా పాజిటివ్ కామెంట్ చేసింది. తోబుట్టువులు రక్తసంబందుల కంటే ఒక మంచి సోదరుడు గా హౌస్ లో తన పట్ల మెలిగాడని స్పష్టం చేయడం జరిగింది. షకీలా ఎలిమినేట్ కావటంతో ప్రస్తుతం హౌస్ లో 12 మంది ఉన్నారు. దీంతో కచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు భారీ ఎత్తున ఉంటాయని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు.