Krishna Mukunda Murari: నిన్నటి ఎపిసోడ్ లో,భవానీ దేవి బోనాలు తీసుకొని కుటుంబంతో సహా మహంకాళి టెంపుల్ కి వస్తుంది. ముకుంద కృష్ణ కొంగున ఏదో దాస్తుంది అని, అదేంటో తెలుసుకోవాలి అనుకుంటుంది.మల్లి సీరియల్ లో గౌతమ్, కృష్ణ కి ఫోన్ చేసి, అరవింద్ మంచివాడు కాదు అని, తనని పట్టుకోవడానికి హెల్ప్ అడుగుతాడు. మురారి కూడా మాటిస్తాడు.
ఈరోజు 209వ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం..
మళ్లీ సీరియల్ కూడా ఇందులోనే చూపిస్తున్నారు.. మల్లి, అరవింద్ ఇద్దరూ బోనాలు తీసుకొని అమ్మవారి గుడి చుట్టూ తిరిగితారు. మళ్లీ బోనం దించిన తర్వాత మీరు ఎంత ప్రయత్నించినా, అరవింద్ గారి భార్య మాలిని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
శివన్న మనుషులు ఎంట్రీ..
కృష్ణ మీద కోపంతో ఉన్న శివన్న, తన మనుషుల్ని, కృష్ణ భర్త ఆయన మురారిని చంపడానికి పంపిస్తాడు. శివన్న రౌడీలు, మురారిని చూసి, ఈ మురారిని మనం చంపేసి కృష్ణను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయి శివన్నకి అప్పచెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అని అనుకుంటారు.పదన్న ఒక్కడే దొరికాడు వేసేద్దాం అని అంటాడు ఒక రౌడీ, వద్దురా ఇప్పుడు వేసేస్తే మనం తప్పించుకోవడం కుదరదు, అదే గుంపులో వేసేసాం అనుకో ఎవరు కాల్చిందో తెలియక, వాళ్ళు వెతుకుతుంటారు మనం ఎస్కేప్ అవ్వచ్చు. అని అంటాడు ఒకడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఏసిపి సారు, చేతిలో చావడం ఖాయం అని అనుకుంటారు.
కృష్ణ కొంగును కట్టుకున్న లెటర్..
ముకుందా చాలా టెన్షన్ గా,అసలు కృష్ణ కొంగులో ఏం దాచుకుంది దాన్ని ఎలా తెలుసుకోవాలి. టైం దొరకట్లేదు చూదాం అంటే,అని టెన్షన్ గా బయట తిరుగుతూ ఉంటుంది. అప్పుడే నీతిగా ఫోన్ చేస్తుంది. ఆ చెప్పుకుఇతిగా మేము గుడికి వచ్చాము. ఇంట్లో అందరం బోనాలు తీసుకొని వచ్చాము అని చెప్తుంది.కృష్ణ కొంగుకి ఏదో ముడి వేసుకొని వచ్చింది అది ఏమిటో తెలుసుకోవాలనుకుంటే కుదరట్లేదు అని గీతికతో చెప్తుంది ముకుంద. సరే నేను మళ్ళీ చేస్తాను కృష్ణ ఇటే వస్తుంది అని ఫోన్ పెట్టేస్తుంది.
కృష్ణ ప్రార్ధన..
కృష్ణ ముకుంద ముందుగానే దేవుడి దగ్గరికి వెళ్తుంది. కానీ ముకుందను చూడకుండా వెళుతుంది. ముకుంద కృష్ణ వెనకాలే ఫాలో అవుతుంది. కృష్ణ మహంకాళి టెంపుల్ లో అమ్మవారి, విగ్రహం దగ్గరకు వెళ్లి, తన కొంగునా ముడి వేసుకున్న లెటర్ ని తీసి అమ్మవారి కాళ్ళ దగ్గర ఉంచి, నాకు అమ్మానాన్న ఎవరూ లేరు అన్నీ ఏసీబీ సరే, ఆయనతో జీవితాంతం నేను కలిసి ఉండేలాగా ఈ లెటర్ ని ఆయనకి అందించేలాగా, తన మనసు మారేలాగా, మనసు అర్థం చేసుకునే లాగా, నువ్వే చేయాలి తల్లి అని దండం పెట్టుకుంటుంది.ఇదంతా ముకుంద వెనుక నుండి చూస్తూ ఉంటుంది.కృష్ణ లెటర్ తీసుకొచ్చింది ఆ లెటర్ లో ఏముంది ఉంటుంది, అసలు లెటర్ ఎవరికి రాసింది, ఇంకెవరికి రాస్తుంది కచ్చితంగా మురారికే రాసి ఉంటుంది. ఎలాగైనా లెటర్ని మురారి కందకుండా చేయాలి అని అనుకుంటుంది.
లెటర్ తీసుకున్న ముకుంద..
చీకటి పడుతుంది,ముకుందా కృష్ణ కోసం వెతుకుతూ ఉంటుంది. దేవుడి దగ్గర దండం పెట్టుకుంటూ, కొబ్బరికాయ తీసుకొని, స్వామిఈ లెటర్ నిమురారి సార్ కి ఇవ్వాలి.నా మనసులో ఉన్న ప్రేమని, ఏసీబీ సార్ కి తెలియజేయాలి. ఇది తొందరపాటు నిర్ణయం, లేక ప్రేమతో తీసుకున్న నిర్ణయం, తెలియదు కానీ ఈ లెటర్ మాత్రం ఈ రోజు కచ్చితంగా మురారి సార్ కి చేరి తీరాలి. తన ప్రేమ నాకు ఈ జన్మకి దక్కేలా చూడు స్వామి అని దండం పెట్టుకుంటూ ఉండగా,ముకుందా వెనకే నించొని ఉంటుంది.కృష్ణకు తెలియకుండా కృష్ణ కొంగుని జాగ్రత్తగా తీసుకొని,కృష్ణ కొంగు న వున్నా లెటర్ ని తీసుకుంటుంది. ఆ లెటర్ ని తీసుకొని కృష్ణకు తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదేమి కృష్ణ గమనించుకోకుండా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉంటుంది.నా ప్రేమ ఏమైనా ఏసీబీ సార్ కి తెలియజేయాలి. ఏసీబీ సార్ నిర్ణయం ఏదైనా నేను దానికి స్వీకరించేలా ఉండాలి. అని దండం పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
లెటర్ చూసి షాక్ అయిన ముకుంద..
కృష్ణ దగ్గర నుంచి కృష్ణకు తెలియకుండా లెటర్ ని తీసుకొని పక్కకు వస్తుంది,ముకుంద. ఎవరు చూడకుండా లెటర్ ని ఓపెన్ చేస్తుంది. లెటర్ మీద మురళి బొమ్మ, నెమలి పించం వేసి ఉంటుంది. దానిని చూసి ముకుంద ఇది కచ్చితంగా లవ్ లెటర్ అయి ఉంటుంది. దేవుడా ఇది ఓపెన్ చేస్తున్నాను ఇది లవ్ లెటర్ కాకుండా ఉండేలా చూడు, అని లెటర్ ని ఓపెన్ చేసి చదువుతుంది. ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగింది. కృష్ణ మురారిని ప్రేమిస్తుంది.సార్ నేను మీ కళ్ళల్లోకి చూసి నా మనసులో మాటని చెప్పలేకపోతున్నాను, బలవంతంగా అనుకోని పరిస్థితుల్లో మన పెళ్లి జరిగిన, నేను మాత్రం మిమ్మల్ని,ప్రేమించడం మొదలు పెట్టాను.ఇప్పుడు నా జీవితం మీకే అంకితం అందులో అని అందులో రాసి ఉంటుంది. ఆల్రెడీ నువ్వు ఒకరిని ప్రేమించిన వాళ్ళని ప్రేమించావు కాబట్టి,నీ ప్రేమ గాలివాటం అని నేను అనుకుంటున్నాను.కాబట్టి నీ ప్రేమని కూడా నేను గాలికి వదిలేస్తున్నాను అని లెటర్ ని గాలిలోకి, విసిరేస్తుంది.
మురారి గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు..
మురారి బయటికి వచ్చి ఇంకా బయటకు రాలేదు ఏంటి అని అనుకుంటూ ఉంటాడు. శివన్న రౌడీలు, మురారిని చూసి ఇప్పుడు మనకి బాగా దొరికాడు. గుడిలో అందరూ ఉంటారు వీడిని చంపడం కుదరదు. ఇప్పుడైతే బయట వేసేస్తే ఎవరికీ తెలీదు. అని మురారిని చూసి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఎక్కడికి కానిస్టేబుల్ ముగ్గురు వస్తారు. సార్ రమ్మన్నారు అని అంటారు. చూడండి మూర్తి గారు నేను చెప్పేంతవరకు మీరు హైడ్ గా ఉండండి.మనం ఎవరి పట్టుకోబోతున్నాను సార్ అని అంటారు.నాకు తెలియదు అని అంటాడు మురారి.కానిస్టేబుల్ అందరూ షాక్ అవుతారు.నాకు తెలిసి మీరు షాక్ అవుతారని,నేను చెప్పేది నిజం. నేను చెప్పేంతవరకు మీరు హైట్ గా ఉండండి నా నుంచి మెసేజ్ రాగానే మీరు అలర్ట్ అవ్వండి.
కృష్ణ ప్రేమలేఖ ఇవ్వాలనుకోవడం..
కృష్ణ ఎలాగైనా మురారి కి ప్రేమలేఖ ఇవ్వాలని, మురారి దగ్గరకు వెళుతూ ఉంటుంది. మధ్యలో ఆగి అవును నేనేంటి ఇలా వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్తే ఏం బాగుంటుంది, ప్రేమలేఖ తీసుకొని కొంచెం సిగ్గుపడుతూ వెళ్తే బాగుంటుంది. మురారి సార్ చూసి, నేను ఏదో చెప్పబోతున్నాను అని అర్థం చేసుకుంటాడు.అని కొంగు తీసుకోగానే అందులో,లెటర్ ఉండదు.ఏమైంది, ఎలా మాయమైంది. అది అసలు ఇక్కడే పడిపోయింది ఇంకా ఎక్కడైనా పడిపోయిందా అని వెతుక్కుంటూ వెనక్కి వెళ్తుందికృష్ణ.
గౌతమ్ రాక..
గౌతమ్ మురారి దగ్గరికి వస్తాడు.చాలా రోజుల తర్వాత నేను చూశాను. ఉన్నావు అని ఒకరికి ఒకరు పలకరించుకుంటారు. తనకి స్వప్న ఎలా దూరమైందో మురారి కి చెప్తాడు. ఇక్కడితో నా లైఫ్ ఆగిపోయింది మురారి అని అంటాడు. వెంటనే మురారి లైఫ్ ఎప్పుడు ఆగిపోకూడదు, నేను నా జీవితంలో, ఒకరోజు నీలానే లైఫ్ ఆగిపోయింది అనుకున్నాను, అని ముకుందతో జరిగిన విషయాలన్నీ గౌతమ్ కి చెప్తాడు. కొన్ని పరిస్థితుల్లో కృష్ణుని పెళ్లి చేసుకున్నాను తర్వాత నాజీవితం ముందుకు సాగుతుంది.నీ జీవితం కూడా ముందుకు సాగాలి. ఒకరి ప్రేమ మనకు దూరమైందంటే ఇంకో ప్రేమ మనకు దగ్గరవుతుందని, అదే గుర్తు అని అంటాడు మురారి.నీ జీవితంలోకి ఇంకో మనిషి వస్తుందేమో, నీ కళ్ళ ముందే తిరుగుతుందేమో, నువ్వు గుర్తుపట్టాలంతే, మన మనసుకి తట్టే వరకు మనకి ప్రేమ,మనకి చేరింది అని తెలియదు. సరే ఇదంతా వదిలే అని అంటాడు గౌతమ్. ముందు పగ గురించి ఆలోచించు. ప్రతీకారం కోరుకునే మనస్సు,ప్రేమని ఎలా చూస్తుంది.ముందు నువ్వు అరవింద్ ని పట్టుకోవాలి. అసలు అరవింద్ ఎవరో నాకు చూపించు అంటాడు మురారి. నేను తనని చిన్నగా, లైఫ్ కి దూరం చేస్తున్నాను. కానీ నువ్వు యాస్ ఏ పోలీస్ ఆఫీసర్ గా తనని అరెస్ట్ చేయాలి. సరే నీకు అరవింద్ ఎక్కడున్నాడో చూసి ఫోన్ చేస్తాను అని గౌతమంటాడు. దూరం నుంచి శివన్న రౌడీలు మురారిని గన్ గురిపెట్టి ఉంటారు.ముందు నువ్వు అరవింద్ చూపించు తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను చెప్తాను అని అంటాడు. సరే అని గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మురారి ఆలోచిస్తూ అక్కడే ఉంటాడు. వేసేయ్ అన్న ఇప్పుడైతే ఒక్కడే ఉన్నాడు అని అంటారు రౌడీలు. సరిగా అప్పుడే అక్కడికి కృష్ణ వస్తుంది. రౌడీలో ఒకడు అన్న వదిన వచ్చింది అని అంటాడు. కృష్ణామురారితో, లోపలికి వెళ్ళండి నేను కాసేపు ఆగి వస్తాను. చిన్న పని ఉంది అని అంటుంది. మురారి కూడా నేను ఫ్రెండ్ ని ఇప్పుడే కలిసాను. అందుకే బయటకు వచ్చాను సరే పదా అని అంటాడు. వెంటనే రౌడీలు గన్ను వెనక్కి తీసుకుంటారు. ఆ లెటర్ కోసం కృష్ణ వెతుకుతూ ఉంటుంది.నా ప్రేమని మీకు తెలియ చేద్దామని అక్షర రూపంలో, లెటర్ లో రాస్తే అది కాస్తా ఇప్పుడు ఎక్కడో పడిపోయింది. మీకు నా ప్రేమని తెలియజేసే అవకాశం రాలేదు. అని బాధపడుతూ ఉంటుంది కృష్ణ. రౌడీలు చా వదిన వచ్చి మన చాన్స్ ని మిస్ చేసింది. అని అనుకుంటూ ఉంటారు.
మళ్లీ కి దొరికిన కృష్ణ లెటర్..
ముకుందా గాలిలోకి ఎగరేసిన, లెటర్ మళ్లీ కి దొరుకుతుంది. ఆ లెటర్ ని తీసుకొని మళ్ళీ కృష్ణ కోసం వెతుకుతూ ఉంటుంది. అదే టైం కి మాలిని మళ్లీ ని చూసి, లవ్ లెటర్ అరవింద్ కోసం రాసిందనుకొని, ఇప్పుడు అందరి ముందు వీళ్ళ బండారం బయట పెట్టాలి. అని మళ్లీ ని ఆపుతుంది.ఏంటి మళ్లీ నువ్వు చేస్తున్న పని, నీకోసం లవ్ లెటర్ రాసావా అని అంటుంది. మళ్లీ షాక్ అవుతుంది. అది కాదు అక్క అని చెప్పేలోపే మాలిని, అ లెటర్ తీసుకొని చదువుతుంది.ఏంటి మళ్లీ ఇదంతా,మంచిగా ఆలోచించే లోపే ఇలాంటిదే ఏదో ఒకటి చేస్తావు. అని మళ్ళీ కోప్పడుతూ ఉంటుంది మాలిని.అందరి ముందుకు తీసుకెళ్లి అరవింద్ కి లవ్ లెటర్ రాసిన మళ్ళీ అని చెప్తుంది.
రేపటి ఎపిసోడ్ లో,నువ్వు అమ్మవారిని కోరుకున్నావు కదా కృష్ణ, ఈ లెటర్నేనే మురారి కి, ఇస్తాను అని, మళ్లీ ఆ లెటర్ ని కృష్ణ కి చెప్పి మురారి కి అందజేస్తుంది. మురారి లెటర్ తీసుకొని ఓపెన్ చేయబోతుండగా, రౌడీలు గన్ గురి పెడతారు. చూడాలి మురారి ఆ లెటర్ ని చదువుతాడా లేదా, రౌడీలు మురారిని షూట్ చేస్తారా.
Krishna Mukunda Murari: బోనాల్లో, భవానీ దేవి కోపానికి మరోసారి బలి కాబోతున్న కృష్ణ..