Kumkuma Puvvu February 2 2024 Episode 2094: యుగంధర్ చూడండి అంజలి మేడం నువ్వు మీ ఫ్యామిలీ మొత్తం ఆ స్మశానం దగ్గరికి రావాలి అని అంటాడు. అంజలి అలాగే కచ్చితంగా వస్తాను అని అంటుంది. రక్ష ఏంటి సార్ ఎసిపి గారు ఆశ మేడం గురించి ఏమైనా ఆధారాలు దొరికాయా అంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది.యుగంధర్ అవును ఆధారాలు దొరికాయి అని అంటాడు. రక్ష ఏంటి సార్ ఆ ఆధారం అని అడుగుతుంది. యుగంధర్ ఆ ఆధారం ఎవరంటే అంజలి అవును అవును రక్ష షాక్ అయ్యావా నేను పోలీస్ రూల్స్ అన్ని పక్కన పెట్టి రంగంలోకి దిగి గేమ్ ఆడితేనే అంజలి దారిలోకి వచ్చింది వచ్చి నిజం చెప్పింది అని అంటాడు. రక్ష ఏంటి సార్ అని అంటుంది. యుగంధర్ ఆ అంజలి నాతో నీకు ఆశ కావాలి అంటే ఈ ఊరు బయట ఉన్న స్మశానంలో వెళ్లి తోవ్వు అని చెప్పింది ఆ అంజలి అని అంటాడు.
రక్ష అంటే ఏంటి సర్ అంటే ఆశ మేడం చనిపోయారా అని అడుగుతుంది.యుగంధర్ అవును ఆశ చనిపోయింది అంజలి బంటి వాళ్ళిద్దరూ కలిసి నా ఆశను చంపి ఆ స్మశానంలో పాతిపెట్టారు ఇక వాళ్ళని వదిలి పెట్టేదే లేదు ఈ యుగంధర ఆడిన గేములు అంజలి చిక్కుకుపోయింది సరే పదండి నా ఆశను పాతిపెట్టిన ఆ స్మశానానికి వెళ్లి తవ్వించాలి అని అంటాడు.నేత్ర అదేంటి సార్ అలా చేస్తే రూల్స్ ప్రకారం చట్టం ఒప్పుకోదు కదా మీడియా పర్మిషన్ తీసుకోవాలి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి అప్పుడే మనం స్మశానం లోకి వెళ్లి ఒక సమాధిని తవ్వి బయటికి తీయాలి అని అంటుంది యుగంధర్ నేను అన్ని రూల్స్ పాటించాను అందరి పర్మిషన్లు తీసుకున్నాను అందరూ అక్కడికి వస్తాను అని చెప్పారు మనం వెళ్లి తవ్వించడమే పదండి ఆయన వాళ్లని తీసుకొని యుగంధర్ స్మశానానికి బయలుదేరుతాడు.
కట్ చేస్తే అంజలి కావేరి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్మశానం కి చేరుకుంటుంది మీడియా కూడా స్మశానం దగ్గరికి చేరుకుంటారు యుగంధర్ వస్తాడు అంజలి చెప్పిన ప్లేస్ లో ఆశ కోసం గోతిని తవ్విస్తూ ఉంటాడు. కావేరి ఒరేయ్ తమ్ముడు ఇదేంట్రా భూగర్భంలో దాచిపెట్టిన నిజం ఇప్పుడు బయట బయలు అయితే మనం చేసేది ఏముంది నాకు చాలా భయంగా ఉంది రా ఇక దెబ్బతో మన ఫ్యామిలీని ఒక ఆట ఆడుకుంటాడు కదా అని అంటుంది. అరుణ్ కుమార్ అక్క నువ్వు అలా భయపడుతున్నట్లు ఉండకు మనం భయపడుతున్నామని తెలిస్తే ఆ యుగంధర్ ఇంకా రెచ్చిపోయి ఎక్కువ చేస్తాడు అందుకే చాలా ధైర్యంగా ఉండాలి అని అంటాడు. కానిస్టేబుల్స్ సార్ ఈ గోతిలో ఏదో బాక్స్ కనిపిస్తుంది అని అంటాడు. అప్పుడే అక్కడికి డిజిపి గారు వస్తారు. ఏంటి యుగంధర్ ఏంటి నువ్వు చేసే పని నీకు స్మశానంలో ఇలా గోతులు తెవ్వమని నీకు నేను చెప్పానా అని అంటాడు.
యుగంధర్ సార్ ఆశ గురించి నాకు ఇక్కడ జాడ దొరికింది అందుకే నేను ఇక్కడ తవ్విస్తున్నాను అందరి పర్మిషన్ తీసుకున్నాను అని అంటాడు. ఎస్సై సార్ ఈ బాక్స్ ఏం చేయమంటారు అని అడుగుతాడు బాక్స్ బద్దలు కొట్టి లోపల ఏముందో ఓపెన్ చేసి చూడండి అని అంటాడు. ఎస్సై బాక్స్ బద్దలు కొట్టి ఓపెన్ చేస్తాడు లోపల ఒక లెటర్ ఉంటుంది సార్ ఇందులో లెటర్ ఉంది అని చెబుతాడు. డి జి పి ఆ లెటర్ ఏంటో తీసి చదువు అని అంటాడు.ఎస్సై ఆ లెటర్ తీసి యుగంధర్ కి ఇస్తాడు. అందులో సార్ నేను అంజలి ని మాట్లాడుతున్నాను ఆశ ఏమైందో మాకు తెలియదు మేము నిర్దోషులం మమ్మల్ని వదిలిపెట్టండి అని రాసి ఉంటుంది. అది విన్నా యుగంధర్ డిజిపి అక్కడ ఉన్న వాళ్లంతా షాక్ అవుతారు.డిజిపి ఏంటమ్మా అంజలి మీరుచట్టంతోనే చెలగాటలాడుతున్నారా అని అంటాడు. అంజలి లేదు సార్ చట్టమే నాతో చెలగాటమాడుతుంది వెనకటికి ఒక సామెత ఉంది కదా సార్ వెనకట శ్రీరాముడు నది స్నానానికి వెళుతుండగా తన కాలి కింద ఒక కప్ప పడి నలిగిపోతుంది అది చూడకుండా వెళ్లిన రాముడు
నది స్నానానికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తుండగా కప్ప బాధను చూసి ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావ్ నీ బాధ ఏంటి నాకు చెప్పొచ్చుగా అని అడిగినప్పుడు ఆ కప్ప ఏముందో తెలుసా అందరి కష్టాలు తీర్చే ఆ రాముడు నాకు గాయం చేశాడని ఎలా చెప్పుకోను అని అంటుందట అప్పుడు ఆ కప్పలాగే ఇప్పుడు నేను నా భర్త ఈ యుగంధర్ కాలి కింద పడి చితికి పోతున్న వాళ్ళం రక్షించే రక్షక బటులే భక్షించే లాగా చేస్తే మేము ఎవరికి చెప్పుకోము సార్ అని అందుకే నేను ఇలా చేశాను అని నన్ను క్షమించండి సార్ ఇందులో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నాకు మీరు ఎలాంటి శిక్ష వేసినా దాన్ని తప్పకుండా పాటిస్తాను అని అంటుంది అంజలి. డిజిపి ఏంటి యుగంధర్ నీకు ఇలా సామాన్యులతో ఆటలాడుకోవడం తప్ప వేరే పని లేదా నీకు మొన్నే చెప్పాను కదా ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని ఆశ కేసులో వెతికి పట్టుకోవాలి తప్ప ఇలా ఒకరిని నిందించి బాధ పెట్టకూడదని నీకు చెప్పాను కదా మరి మళ్ళీ ఎందుకు నువ్వు ఇలా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావ్ అని యుగంధర్ ని తిట్టి వెళ్లిపోతాడు యుగంధర్ అంజలి నువ్వు చాలా తెలివిగా మళ్లీ నన్ను దెబ్బ కొట్టావు అనుకుని వెళ్లిపోతాడు.
కట్ చేస్తే శాంభవి జై చంద్ర గారు ఇరవై ఐదు ఏళ్ల వరకు వారసులు ఎవరు వచ్చినా తన ఆస్తి ఆవారసులకు చెందాలని టైం పెట్టాడు కదా ఆ టైం ఇప్పుడు దగ్గరపడింది ఇప్పటివరకు ఎవరు రాలేదు ఇక ఈ చివరి నిమిషంలో ఎవరూ రారు అనుకుని ఆ శాంభవి జై చంద్ర ప్రకృతి వైద్యశాలను అమ్మడానికి తను బేరం కుదుర్చుకుంటుంది. అది తెలిసిన అ జై చంద్ర ఫౌండేషన్ లో లాయర్ తరువాత అందులో మెంబర్లు శాంభవి దగ్గరికి వచ్చి ఏంటండీ మీరు చేసేది ఏమైనా బాగుందా ఈ జై చంద్ర ఫౌండేషన్ ప్రకృతి వైద్యశాల ఇది జై చంద్ర గారి వారసత్వానికి మాత్రమే సొంతం మరి వారెవరు రాకుండానే మీరు ఎలా బేరం పెడతారు అని అడుగుతారు. శాంభవి మీకు అదంతా నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు ఇరవై ఐదు ఏళ్లు పూర్తి గా వస్తుంది ఇక వాళ్ళు ఎవరూ రావడం లేదు అందుకే నేను బేరం పెట్టాను అని అంటుంది.లాయర్ మీరు అలా ఎలా పెడతారు మీలాగే మేము కూడా ఈ ఫౌండేషన్ లో మెంబర్షిప్ లం మరి మేము ముగ్గురం ఒప్పుకుంటేనే కదా మరి అలా కానప్పుడు మీ ఒక్కదాని పరిమిషన్ తోనే ఎలా ఈ ఫౌండేషన్ ని అమ్మడానికి నిర్ణయం తీసుకుంటావు ఇది ఎప్పటికైనా అ జై చంద్ర వారసత్వానికి చెందాలి అందుకు మేము ఎంత దూరమైనా వెళ్తాము నీవు మమ్మల్ని కాదని ఒక్క అడుగు ముందుకేసిన తర్వాత కోర్టు ద్వారా నీతో తేల్చుకుంటాము అని వెళ్ళిపోతారు