Nindu Noorella Saavasam December 04 2023 Episode 97: మరలా చెప్తున్నాను బాలిక నీ కుటుంబానికి కష్టము కొనితెచ్చు వారు నీవే మరలా మరలా ఎందుకు చెప్పుచుంటినో తెలుసా బాలిక ఆ మాంత్రికుడు అతీతమైన శక్తులు పొందిన తర్వాత నీ చేత పాపపు పనులు చేయించి ఈ సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తూ భగవంతుడిని సైతం నిలదీయగలడు అందుకు నీ ఆత్మని వశ పరుచుకొని నీ చేత పాపపు పనులు చేయిస్తాడు అందుకే నా ఉంగరము నాకిచ్చినచో మనము మా యమలోకమునకు పోయేదము నీ కుటుంబము క్షేమంగా ఉండును అని గుప్త అంటాడు. ఆ మాంత్రికుడు నిన్ను వశపరచుకొని నీ కుటుంబమునకు కష్టములు తెస్తాడు నీ చేతిలో నా చేతిలో ఏమీ లేదు అని గుప్త అంటాడు. నిజమా గుప్త గారు అని అరుంధతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే, రేపు ఎగ్జామ్ లో పాస్ అవ్వగలనా పాస్ అవుతానని మాటిచ్చాను ఎలాగైనా సరే పాస్ అవ్వాలి అని అంజు చదువుతుంది. అంజు చదవడం చూసి అందరూ షాక్ అవుతారు. అంజు ఏం చేస్తున్నావ్ అని అమృత అడుగుతుంది.
రేపు ఎగ్జామ్స్ కదా చదువుతున్నాను అని అంజు అంటుంది. నీ ఆరోగ్యం బాగోలేదు కదా ఎందుకు చదువుతున్నావ్ పడుకో అని ఆకాష్ అంటాడు. ఎగ్జామ్ లో పాస్ అవ్వాలంటే చదవాలి కదా అమ్ములు అని అంజు అంటుంది. ఈ స్కూల్లో కాకపోతే వేరే స్కూల్లో జాయిన్ కావచ్చు దానికి ఎందుకు అంతలా కంగారు పడతావు పడుకో అంజు అని ఆకాష్ అంటాడు. మీరు లేకపోతే నేను ఎలా వేరే స్కూల్లో జాయిన్ అవుతాను స్కూల్ అయిపోయిన తర్వాత మనందరం గార్డెన్లో ఆడుకుంటుంటే రాథోడ్ గారు వచ్చి మన నలుగురిని తీసుకువస్తారు అలాంటి మెమొరీస్ మనకు ఉండాలి అంటే నేను బాగా చదివి ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి అని అంజు ఏడుస్తుంది. దూరం నుంచి చూస్తున్న అమరేంద్ర బాధపడతాడు. అమ్ము ఉదయం నుంచి చదువుతున్నాను ఫస్ట్ చాప్టర్ లో ఒక క్వశ్చన్ అడగవా అని అంజు అంటుంది. అంజు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో ఎగ్జాము తర్వాత పాస్ అవ్వచ్చు అని అమృత అంటుంది. సంవత్సరమంతా చదివితేనే కానీ ఎగ్జామ్లో పాస్ అవ్వలేము అలాంటిది మూడు రోజుల్లో చదివి ఎలా పాస్ అవుతావు అంజు అని ఆకాష్ అంటాడు.
అది కాదు నేను బాగా చదవాలి అని అంజలి ఏడుస్తుంది.అంజు నువ్వు అలాంటివన్నీ ఏమి మనసులో పెట్టుకోకు నువ్వు అయితే ముందు రెస్ట్ తీసుకో అని పడుకోబెట్టి అమృత వెళ్ళిపోతుంది. అమరేంద్ర అంజు బాధని చూసి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అంజు నువ్వు అలా తయారు కావడానికి నేనేనమ్మ నన్ను క్షమించు అని అరుంధతి ఏడుస్తుంది. కట్ చేస్తే, నేను అంజలిని పాత స్కూల్లోనే జాయిన్ చేద్దామనుకుంటున్నాను మిస్సమ్మ నువ్వు వెళ్లి అంజలితో చెప్పు అని అమరేంద్ర అంటాడు. అంజలి ఎగ్జామ్ రాస్తుంది పాస్ అవుతుంది నాకు నమ్మకం ఉందండి మీరందరూ ఏమీ అనుకున్న నాకు మాత్రం అంజలి మీద నమ్మకం ఉంది అని భాగమతి అంటుంది.నువ్వు అన్నట్టుగా నిజంగానే నాకు నమ్మకం ఉంది కానీ అమ్ము అడిగిన చిన్న క్వశ్చన్ కి సమాధానం చెప్పలేక పోయింది రేపు ఎగ్జామ్లో ఎలా రాయగలుగుతుంది పాస్ ఎలా అవుతుంది అని అమరేంద్ర అంటాడు.
ప్రయత్నించకుండా పాస్ ఎలా అవుతుంది అంటే ఎలాగండి నేను ఒప్పుకోను క్షమించండి అని భాగమతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, ఆ మాంత్రికుడు అరుంధతిని ఎలా పట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఆత్మను నేను ఎందుకు వశపరచుకోలేకపోయాను ఎందుకు నేను ఎంత ప్రయత్నించినా ఆత్మను బంధించలేకపోతున్నాను ఎందుకు అని కోపంగా అరుస్తూ ఉంటాడు మాంత్రికుడు. దశదిన కర్మ అయిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్ళకుండా నాకంటే ఎందుకు పడింది తనని ఎందుకు బంధించలేకపోతున్నాను అని అరుస్తూ విభూదిని తీసి పైకి చల్లుతాడు మాంత్రికుడు. కళ్ళల్లో కంగారు గొంతులో భయం ఏం జరిగింది గోరా అని వాళ్ళ గురువు అడుగుతాడు. కొన్నేళ్లుగా తపస్సు చేస్తున్నాను నా విజయానికి అడుగు దూరంలో ఉన్న నేను విజయం పొందడానికి నాకు ఒక ఆత్మ కావాలి అన్నారు ఆత్మ నాకు కనిపించింది కానీ నేను దాన్ని బంధించలేకపోతున్నాను అసలు ఎందుకు నాకు అత్మ చిక్కడం లేదు అని మాంత్రికుడు అంటాడు. ఆ ఇంట్లో వాళ్ళ ప్రేమ ఆమెని బంధించేసింది అందుకే నువ్వు ఆమెని బంధించలేకపోతున్నావు అని వాళ్ళ గురువుగారు అంటాడు. మరి నేనేం చేయాలి అని మాంత్రికుడు అంటాడు.
రేపు ఆత్మ బయట ఉంటుంది తనను బంధించగలవా లేదా అనేది అంతా నీ చేతిలో ఉంటుంది అని వాళ్ల గురువుగారు అంటాడు. రేపు అంతా ఆత్మ బయట ఉంటుందా అతనిని ఎలాగైనా బంధిస్తాను అని వెక్కిలి నవ్వు నవ్వుతాడు మాంత్రికుడు. నువ్వు తనని ఎలా బంధిస్తావు అనేది కాదు గోరా తనని బంధించే రోజు రేపు ముఖ్యమైనది తనను బంధిస్తే సృష్టిలో నీవు చాలా గొప్ప వాడివి అయిపోతావు అది గుర్తుపెట్టుకొని ఆత్మను బంధించే ప్రయత్నం చెయ్యి ఘోర అని వాళ్ల గురువు గారు మాయమైపోతాడు. రేపు ఆత్మని బంధించి సృష్టికి అధిపతిని అయిపోతాను అని అఘోర మురిసిపోతూ ఉంటాడు. కట్ చేస్తే, అంజుకు ఏమైంది తన ఆరోగ్యం కుదుటపడిందా లేదా అని అరుంధతి పరిగెత్తుకొచ్చి చూస్తూ ఉంటుంది.
అంజు అలా అనకూడదమ్మ ఒక్క ముద్ద తిను ఎగ్జామ్ ఎలా రాస్తావు అంజు అని భాగమతి నచ్చజెప్పి అంజలికి అన్నం తిన పెడుతుంది. అందుకే నాలాగానే మాటలు చెప్తూ అన్నం తినిపిస్తుంది మిస్సమ్మ అని అరుంధతి దూరం నుంచి చూస్తూ అనుకుంటుంది.నువ్వు అన్నం తినకపోతే నీకు శక్తి రాదు అప్పుడు నువ్వు ఎలా ఎగ్జామ్ రాయగలవు చెప్పు అని భాగమతి అంటుంది.నాకు వద్దు తినాలని లేదని చెప్తున్నాను కదా అని అంజలి అంటుంది.