BRS MLA: కుత్భుల్లాపూర్ (హైదరాబాద్) నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద రెండు రికార్డులను సొంతం చేసుకున్నారు. వరుసగా 2014,2018, 2023 ఎన్నికల్లో గెలిచి హాట్రిక్ రికార్డు సాధించారు. అంతే కాకుండా ఏకంగా 85,575 భారీ ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. కాంగ్రెస్, బీజేపీ నుండి బలమైన అభ్యర్ధులు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వివేకానంద్ తనదైన శైలిలో పాదయాత్రల ద్వారా, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి ప్రజలకు చేరువ అయ్యారు.
2009 లో ఈ నియోజకవర్గం ఏర్పడగా, నాడు స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్ విజయం సాధించారు. ఆ తర్వాత శ్రీశైలంగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి కోలాన్ హనుమంత్ రెడ్డి పై వివేకానంద టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి 39, 021 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. శ్రీశైలం గౌడ్ మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు వివేకానంద. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీశైలం గౌడ్ పై వివేకానంద 41వేల ఓట్ల మెజార్టీ గెలిచారు. ఈ ఎన్నికల్లో శ్రీశైలం గౌడ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరి పోటీ చేశారు.
కాంగ్రెస్ పార్టీ నుండి కోలాన్ హనుమంత్ రెడ్డి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి శ్రీశైలం గౌడ్ పై వివేకానంద ఏకంగా 85,576 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సాధించారు. వరుస మూడు ఎన్నికల్లోనూ మెజార్టీ పెరుగుతూ వచ్చింది. ఇది ఆయన పనితీరుకు నిదర్శమని ఆయన అభిమానులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. విజయం సాధించిన తర్వాత వివేకానంద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద కు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా చింతల్ పార్టీలో కార్యాలయానికి చేరుకుని ఈ విజయం కుత్భుల్లాపూర్ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.
Telangana Election: ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు ఈ గ్లోబెల్స్ ప్రచారం ఎందుకు..?