The Kerala story OTT streaming: ఎంతో కఠినాతి కఠినమైన స్టోరీ ది కేరళ స్టోరీ మూవీ థియేటర్లో ఎవ్వరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఈ సినిమాలో ఆదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా.. సుదీప్తా సేమ్ దర్శకత్వం వ్యవహరించారు. కేరళ అమ్మాయిలను మోసగించి వారిని ముస్లిం కులం లోకి మార్చి దేశం మొత్తం ముస్లింసే ఉండాలి అనే మూఢనమ్మకంలో బ్రతికే కొందరి ఊహకు కొంతమంది ఆడపిల్లలు చిక్కుకున్నారు. గత ఏడాది మే 5వ తేదీన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయింది.
ఇక థియేటర్లో రిలీజ్ అయిన చాలా విరామం అనంతరం ఓటీటీలోకి దర్శనం ఇచ్చింది. థియేటర్లో రిలీజ్ అయి సుమారు 9 నెలలు కావచ్చిన కేరళ స్టోరీ మాత్రం ఇటీవలే ఓటిటిలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఈ మూవీ జీ5 లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇక ఈ మూవీ విడుదలయ్యే సమయానికి గుంటూరు కారం మరియు నా సామి రంగ, సైంధవ్ వంటి సినిమాలు లైన్లో ఉన్నప్పటికీ అవేవీ వీరు పట్టించుకోకుండా రిలీజ్ చేసి టాప్ ఫస్ట్ ప్లేస్ ని దక్కించుకున్నారు. 15 రోజులుగా జీ5 లో ది కేరళ స్టోరీ టాప్ లో ట్రెండ్ అవుతుంది.
అంటే ఈ మూవీ ఎంత ప్రేక్షక ఆదరణ పొందుతుందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా మరో మైలురాయి దాటినట్లు తెలుస్తుంది. జీ 5 ఓటీటీలో ఈ మూవీ రికార్డ్ స్థాయిలో న్యూస్ దక్కించుకుంది. 15 రోజులుగా ట్రెండింగ్ అవుతున్న ఈ మూవీ లిస్ట్ లో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది. ఇక ఈ సినిమా తాజాగా 300 మిలియన్ల వాచ్ మినిట్స్ దాటినట్లు తెలుస్తుంది. 15 రోజుల్లోనే ఈ మూవీ ఈ స్థానం సంపాదించడం అంటే సాధారణ విషయం అయితే కాదు.
ఈ మూవీ 300 మిలియన్లను అధిగమించిన విషయాన్ని జీ5 ఓటీటీ నిన్న అనగా మార్చి రెండవ తారీకున వెల్లడించింది. ఇక ఈ మూవీ తెలుగు, తమిళ్తో పాటు మలయాళం మరియు కన్నడ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాలో అదా శర్మ పాత్రకి గొప్ప ప్రాధాన్యత దక్కింది. ఈమె ఖాతాలో ప్రస్తుత కాలంలో సరైన హిట్ లేదు. కానీ డి కేరళ స్టోరీ తో అదా శర్మ మళ్ళీ ఫామ్ లోకి వచ్చిందని చెప్పొచ్చు. సాధారణంగా స్టార్ హీరో సినిమాలైన గుంటూరు కారం మరియు నా సామిరంగ మూవీకే ఇంత యూస్ దక్కలేదు. అలాంటిది ఈ మూవీకి దక్కడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని గొప్ప రికార్డులను నెలకొల్పుతుందో చూడాలి మరి..!