ఈ రోజుల్లో ఎక్కువమంది బాధపడే అనారోగ్య సమస్యలను మధుమేహం కూడా ఒకటి.. ప్రతి 10 మందిలో ఏడుగురు ఈ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.. డయాబెటిస్ లెవెల్స్ ను ఎప్పటికప్పుడు నియంత్రణలోనే ఉంచుకోవాలి.. లేదంటే పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటే.. ప్రతిరోజు పరగడుపున దాల్చిన చెక్క, వెల్లుల్లి తో తయారు చేసిన నీటిని తాగాలి..! అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!
ముందుగా పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీటిని పోసి బాగా మరిగించాలి. అందులో చిన్న దాల్చిన చెక్క ముక్క నుండి వెల్లుల్లి రెబ్బలు మెత్తగా దంచి అందులో వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత ఈ నీటిని ఒక గ్లాసులోకి వడపోసుకోవాలి. అందులో ఒక చెంచా నిమ్మరసం కలపాలి. ఇలా ఈ నీటిని ఏ సమయంలోనైనా తాగవచ్చు. కాకపోతే ఈ నీళ్లు తాగే ఒక అరగంట ముందు ఏమి తినకూడదని గుర్తుంచుకోవాలి. ఉదయం పరగడుపున తాగితే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి..
దాల్చిన చెక్క వెల్లుల్లితో తయారు చేసుకున్న నీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి. అంతే కాకుండా ఈ హెర్బల్ డ్రింక్ రక్తంలో కొలెస్ట్రాల్ ను ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. దాంతో డయాబెటిస్ కారణంగా వచ్చే గుండె సమస్యలు కూడా రాకుండా మనల్ని రక్షిస్తాయి. ఇంకా శరీరంలో ఇన్సూరెన్స్ కాయలను నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడం వల్ల రక్తంలో గ్లూకోజ్ సాధారణ స్థితికి వస్తుంది. నరాల బలహీనత కూడా తగ్గుతుంది..