సాధారణంగా వరి మాదిరిగానే వెదురు చెట్లకు పూ.. ఆ తర్వాత కంకులు పడతాయి.. అయితే వెదురు మొక్క సాధారణంగా పూయదు.. ఒకవేళ పూసిన ఏ వందలకు పూస్తుంది. అడవుల్లో ఉండే గిరిజనలు చాలామంది తమ జీవితకాలంలో ఎప్పుడు వెదురుపూతను చూసి ఉండరు.. కొన్ని వెదురు జాతులు మాత్రం 50 సంవత్సరాలకు ఒకసారి పూస్తూ ఉంటాయి.. పూత పూసక వెదురు బియ్యం కంకులు వస్తాయి ఇవి వాటి జీవిత కాలంలో ఒక్కసారి వస్తాయి.. వెదురు కర్ర ముదిరిన తర్వాత వాటిల్లో ఉండే గింజల నుంచి ఈ బియ్యాన్ని సేకరిస్తారు.. ఇవి చూడటానికి బార్లీ గింజరి మాదిరిగా ఉంటాయి.. రుచికి మాత్రం వగరుగా ఉంటాయి.. వెదురు బియ్యాన్ని వంశీలోచన అని కూడా అంటారు..
ఒక కప్పు వెదురు బియ్యం లో 160 క్యాలరీల శక్తి అందుతుంది. ఇందులో కార్బోహైడ్రేడ్, ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి.. కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.. అయితే ఈ బియ్యాన్ని మితంగానే తీసుకోవాలి.. రోజుకి 15 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..
వెదురు బియ్యంతో చేసిన జావను తాగితే కీళ్ల నొప్పులు, నడుము నొప్పి తగ్గుతాయి.. మూత్రం లో మంటను తగ్గిస్తుంది.. దగ్గు జలుబు ఎక్కువగా వేధిస్తుంటే వెదురు బియ్యం చూర్ణాన్ని తేనెలో కలిపి తీసుకుంటే తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది.. ఈ బియ్యం అన్నం తినటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంటుంది మధుమేహాన్ని తగ్గిస్తుంది.. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.. శరీరంలో ఉండే టాక్సిన్ లను తొలగిస్తుంది.. శరీర వాత పిత్త కఫ దోషాలను తొలగిస్తుంది.. సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతుంది..