Leaves: ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్న ఆరోగ్య సమస్యలు మధుమేహం కూడా ఒకటి.. ప్రతి పది మందిలో ఏడుగురు ఈ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.. రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిస్ వస్తుంది.. ఆహార నియమాలతో పాటు ఉదయం పరగడుపున ఈ ఆకుల కషాయం తాగితే.. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు..!
మామిడి పండ్లు మధుమేహుల ఆరోగ్యానికి హానకరమని తెలిసిందే.. కానీ మామిడి ఆకులు మాత్రం డయాబెటీస్ రోగులకు గొప్ప వరం. ఈ ఆకులో విటమిన్ సి, ఫైబర్, పెక్టిన్ ఉన్నాయి.. ఈ ఔషధ గుణాలు డయాబెటీస్ ను తగ్గించడంతోపాటు అధిక బరువు, రక్త పోటును కూడా తగ్గిస్తాయి. 5 మామిడి ఆకులను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఒక గ్లాస్ నీటిలో మామిడి ఆకులను వేసి ఐదు నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ నీరు బాగా మరిగిన తరువాత ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచాలి. మామిడి ఆకుల లోని రసం అంతా ఆ నీటిలోకి దిగుతుంది.
ఉదయం ఆ నీటిని వడపోసుకుని తాగాలి. ఇలా మామిడి ఆకుల కషాయం వారం రోజుల పాటు తాగితే డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ప్రతి రోజు తాగితే మధుమేహానికి శాశ్వతంగా చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా ఈ కషాయం తాగితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.