Diabetes: మధుమేహం సమస్య ఒక్కసారి వస్తే జీవితాంతం జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.. దానికి అనుగుణంగా తమ డైట్ ను సెట్ చేసుకోవాలి.. డయాబెటిస్ ఉన్నవారు అన్ని రకాల పండ్లను తినకూడదు.. ఎందుకంటే వాటిలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. అయితే మధుమేహులు నిరభ్యంతరంగా ఈ నాలుగు రకాల పండ్లు తినవచ్చు..!! అవేంటంటే..!?
ఈ సీజన్లో రేగుపళ్ళు విరివిగా లభిస్తాయి. వీటిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ తో బాధపడుతున్న ఈ పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇక రెండవ పండు విషయానికొస్తే నారింజ.. ఇందులో 43 శాతం వరకు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది కూడా డయాబెటిస్ లెవెల్స్ ను అదుపులో ఉంటుంది.
రోజుకు ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లడం అవసరం లేదని అందరికీ తెలిసిందే. అయితే మధుమేహులు ఈ కాయ తినవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. దీనిలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందువలన డయాబెటిస్ నిరభ్యంతరంగా ఈ పండు తినవచ్చు. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దోహదపడుతుంది. ఇక ఆఖరిది చెర్రీ పండు. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా తియ్యదనం తక్కువగా ఉంటుంది. చెర్రీ పండు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసే గుణం కలిగి ఉంది. డయాబెటిస్ ఎంచక్కా ఈ నాలుగు రకాల పండ్లను తినొచ్చు.