వర్షాకాలం అంటేనే వ్యాధులకు నిలయం.. సీజన్ మారినప్పుడల్లా అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి.. అందుకు ముఖ్య కారణం మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేకపోవడం.. కానీ మన శరీరంలో తగినంత ఇమ్యూనిటీ పవర్ ఉన్నా కూడా.. వర్షాకాలంలో జ్వరం, దగ్గు, జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి.. ఈ సమస్యలన్నిటికీ మన వంట గదిలో ఉండే మసాలా దినుసులతో చెక్ పెట్టవచ్చు..! అవెంటంటే.!?
లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు ఈ నాలుగు మసాలా దినుసులు రేయిని సీజన్లో కనక వాడితే రోగాలే రావంటున్నారు ఆరోగ్య నిపుణులు.. పసుపు లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది.. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా మన శరీరంలోకి హానికర బ్యాక్టీరియా ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.. మన తీసుకున్న ఆహార పదార్థాలలో తరచుగా పసుపును ఉపయోగించడం వలన.. మన శరీరాన్ని రక్షణ కవచంలా కాపాడుతుంది..
లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క వీటిలో ప్రోటీన్స్ మినరల్స్ సమృద్ధిగా లభించడంతోపాటు ఆంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.. ఈ సీజన్లో వీటిని తీసుకోవడం వలన శరీరంలో వేడి పుట్టే లాగా చేస్తుంది.. ప్రస్తుతం వాతావరణం లో చలి ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి శరీరం లోపల నుంచి తగినంత వేడిని అందిస్తుంది.. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.. వీటిని తరచుగా వంటలలో తీసుకోవచ్చు.. లేదంటే నేరుగా కూడా వీటిని రోజు చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవచ్చు.. ఇలా వీటిని తీసుకోవడం వలన ఈ సీజన్లో వచ్చే వ్యాధులను అడ్డుకోవడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది..