Sargam Kaushal: సాధారణంగా ఆడవాళ్ళకి అంటే ఇక వారి జీవితానికి ముగింపు పలికినట్టే.. అని అనుకునేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు.. పెళ్లి తర్వాత తన కుటుంబం గురించి తప్ప మిగతా వాటి మీద ధ్యాస పెట్టేంత తీరిక ఓపిక ఉండదు.. తన ఆరోగ్యం పట్టించుకోదు.. ఇక పెళ్లయిన తర్వాత వారి అందం మీద శ్రద్ధ తీసుకునే ఆడవారిని వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు.. వారి గురించి ఆలోచించి శ్రద్ధ తీసుకుంటే అద్భుతాలే చూపించొచ్చు.. అనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది విజయవాడకు చెందిన ఓ మహిళ.. ఆమె సర్గమ్ కౌశల్..!
మిసెస్ వరల్డ్ 2022 అంతర్జాతీయ అందాల పోటీల్లో భారతీయ స్త్రీ విజయం సాధించింది. అమెరికా, లాస్వేగాస్ వేదికగా జరిగిన మిసెస్ వరల్డ్ 2022 అందాల పోటీల్లో భారత్కు చెందిన సర్గమ్ కౌశల్ విజేతగా నిలిచి.. కిరీటం కైవసం చేసుకుంది. 21 ఏళ్ల తర్వాత మళ్లీ మిసెస్ వరల్డ్ కిరీటం ఇండియాకు దక్కింది. రెండు దశాబ్దాల తర్వాత.. ఈ కిరీటం గెలుచుకున్న భారతీయ మహిళగా కౌశల్ నిలిచింది. 2001లో భారత్కు చెందిన డాక్టర్ అదితీ గోవిత్రికర్ తొలిసారి ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. మళ్లీ 21 ఏళ్ల తర్వాత.. సర్గమ్ కౌశాల్ విజేతగా నిలిచారు. ఇక గతేడాది మిసెస్ వరల్డ్ విజేత అయిన షాయలిన్ ఫోర్డ్ సర్గమ్కు ఈ కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో మిసెస్ పాలినేషియా మొదటి రన్నరప్గా నిలవగా.. మిసెస్ కెనడా రెండో రన్నరప్గా నిలిచారు.
భారత్ కు మిసెస్ వరల్డ్-2022 సర్గం కౌశల్ ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. శనివారం అమెరికాలోని లాస్ వెగాస్ రిసార్ట్ అండ్ క్యాసినోలో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు పాల్గొనగా సర్గం కౌశల్ ను వరించింది. 63 దేశాలకు చెందిన మహిళలను ఓడించి కౌశల్ కిరీటాన్ని దక్కించుకుంది. 21 ఏళ్ల తర్వాత భారత్ నుంచి సర్గమ్ కౌశల్ మిసెస్ వరల్డ్ గా ఎంపికైనట్లు మిసెస్ ఇండియా పోటీ నిర్వహణ సంస్థ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
టైటిల్ ను గెలుచుకోవడంపై సర్గమ్ కౌశల్ హర్షం ఆనందం వ్యక్తం చేశారు. 21 నుంచి 22 ఏళ్ల తర్వాత భారత్ తరపున మళ్లీ కిరీటాన్ని అందుకోవడం ఆనందంగా అన్నారు. ఐ
లవ్ యూ ఇండియా.. లవ్ యూ వరల్డ్ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. సర్గమ్ కౌశల్ జమ్మూకశ్మీర్ కు చెందినామె. ఆమె ఇంగ్లీష్ సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందారు. కౌశల్ గతంలో వైజాగ్ లో ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఆమె భర్త ఇండియన్ నేవీలో పని చేస్తున్నట్లు వివరించారు.