ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారితో పోరాటం చేస్తోంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీలే కరోనా వల్ల కుప్పకూలిపోయాయి. తాజాగా తమ కంపెనీ ఉద్యోగుల్లో 20 వేల మంది కరోనా బారిన పడ్డారని అమెజాన్ కంపెనీ స్పష్టం చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని బ్రాంచుల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 20 వేల మందికి కరోనా సోకిందట. అయితే.. మొత్తం.. ఫ్రంట్ ఎండ్ లో పనిచేసే 1.37 మిలియన్ ఉద్యోగుల్లో 20 వేల మందికి కరోనా సోకడంతో… పాజిటివ్ రేటు.. ఊహించిన దానికంటే తక్కువే ఉందని కంపెనీ ప్రకటించింది.
అమెజాన్ ప్రతి రోజు తమ ఉద్యోగుల్లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించిందట. అంతే కాదు.. కరోనా మహమ్మారితో పోరాడటానికి.. వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఉద్యోగుల్లో ప్రతి రోజూ అమెజాన్ అవేర్ నెస్ తీసుకొచ్చిందట. ప్రతి రోజు ఏ బ్రాంచ్ లో ఏ ఉద్యోగికి కరోనా సోకిందో.. దానికి సంబంధించిన అన్ని విషయాలను అమెజాన్ తమ ఉద్యోగులతో పంచుకునేదట. అలా చేయడం వల్లనే కరోనా వ్యాప్తి రేటును చాలావరకు తగ్గించగలిగామని అమెజాన్ చెప్పుకొచ్చింది.