2023 WC: 2019 వన్డే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ప్రపంచ క్రికెట్లో భారత్ కు ధీటుగా బలమైన శక్తిగా మారింది. మొట్టమొదటిసారి సొంతగడ్డపై ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు తదుపరి ప్రపంచ కప్కు అర్హత సాధించిన విషయం లో సందిగ్ధత ఏర్పడింది. మామూలుగా అయితే టాప్ 8 లేదా టాప్ 10 జట్లు నేరుగా ప్రపంచకప్ కు అర్హత సాధిస్తాయి.
అసోసియేట్ దేశాలు లేదా తక్కువ ర్యాంకింగ్స్ లో ఉన్న దేశాలు క్వాలిఫయిర్స్ ఆడి ప్రపంచ కప్ కు అర్హత సాధిస్తాయి. అయితే ఐసిసి ప్రవేశపెట్టిన కొత్త ఫార్మాట్ ప్రకారం ప్రతి ఒక జట్టు ఒక ప్రపంచ కప్ నుండి మరొక ప్రపంచ కప్ కు మధ్యలో ఆడే వన్డే సిరీస్ ద్వారా వాటికి పాయింట్లు కేటాయిస్తారు. వాటిలో అర్హత సాధించిన జట్టు మాత్రమే ప్రపంచకప్ ఆడేందుకు అనుమతించబడతాయి.
2023 వన్డే ప్రపంచకప్ భారతదేశంలో జరగబోతుంది కాబట్టి టీమిండియా నేరుగా అర్హత సాధించింది. ఇక ఇంగ్లాండ్ ప్రస్తుతం 65 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్… ఇంగ్లాండ్ కు 15 పాయింట్లు మాత్రమే తేడా. ఇప్పుడు పాకిస్తాన్ తో మూడు మ్యాచ్ల సిరీస్ ఆడబోయే ఇంగ్లాండ్ జట్టు ఆ మూడు మ్యాచ్లలో ఓడిపోతే అర్హత సాధించే విషయంపై మరింత అనుమానం ఏర్పడుతుంది.
కానీ పాకిస్తాన్ తో ఇంగ్లండ్ ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా దాదాపు ప్రపంచ కప్ కి అర్హత సాధించినట్లే. కరోనా కారణంగా చాలా సిరీస్లు రద్దు కావడం వాటిలో పాయింట్లు సమానంగా పంచడం ద్వారా ఇంగ్లాండ్ ప్రపంచ కప్ పై అనుమానాలు నెలకొన్నాయి. ఇకపోతే ప్రపంచ నెంబర్ వన్ జట్టు ఇంగ్లాండ్… పాకిస్తాన్ పై మూడు మ్యాచ్లు ఓడిపోవడం కష్టమైనా సంచలనాలకు మారుపేరు అయిన పాకిస్తాన్ అసాధారణంగా ఆదితే మాత్రం డిఫెండింగ్ చాంపియన్స్ వరల్డ్ కప్ ఆడేది కష్టమే.