ఇటీవల జొన్న రొట్టెలు తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పల్వట్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఆ కుటుంబంలోని మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. జంగం కులానికి చెందిన శంకరమ్మ పల్వట్ల గ్రామంలో నివాసం ఉంటోంది. కొన్నాళ్ల కిందట ఆమె భర్త చనిపోవడంతో ఆమె కులవృత్తిలో భాగంగా గ్రామంలో అడుక్కొచ్చిన ఆహారం తినేది.
ఆమెకు ముగ్గరు కొడుకులు మరియు వీరి ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. ఆమె కొడుకులు జీవనోపాధి కోసం పల్వట్ల గ్రామాన్ని వదిలి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.
శంకరమ్మ ఒక రోజు ఊరిలో అడుక్కొని వచ్చిన జొన్న పిండితో రొట్టెలు చేసుకుని తిన్నది. ఆ జొన్న రొట్టెలు తిన్న తరువాత శంకరమ్మ అస్వస్థతకు గురై హాస్పిటల్ లో మరణించింది. అయితే, ఆమె అంత్యక్రియలకు వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు తినడానికి ఏమి లేక ఇంట్లోనే ఉన్న మిగిలిన జొన్న పిండితో రొట్టెలు చేసుకుని తిన్నారు.
వారు తిన్న కాసేపటికే అస్వస్థతకు గురిఅవ్వడం తో వారిని హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా శంకరమ్మ కుమారులు శ్రీశైలం మరియు చంద్రమౌళి దారిలోనే మరణించారు. ఇది జరిగిన కొన్ని గంటలకే శంకరమ్మ పెద్ద కోడలు అయిన సుశీల కూడా మరణించింది.
ఇంక మిగిలిన వారిని హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ చంద్రమౌళి భార్య కూడా చనిపోయింది. ఈ వరుస మరణాలతో ఆ కుటుంబంలో మరింత విషాదం నెలకొంది. చివరికి ఆ కుటుంబంలో ఐదురుగు మరణించగా ఇద్దరు మాత్రమే మిగిలారు.
కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఇదంతా జరగడంతో ఆ కుటుంబంలోని మిగిలిన ఇద్దరు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. వారి బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక, శంకరమ్మ చివరి కోడలు సరిత ఉస్మానియ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వారు జొన్న పిండిలో విష పదార్థం ఏమైనా కలిసిందా లేదా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.