ఢిల్లీ, జనవరి11: జగన్పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు ఈనెల 25 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. విశాఖ జైల్లో ఉన్న నిందితుడిని శుక్రవారం ఎన్ఐఎ విజయవాడ ఫ్యామిలీ కోర్టులో హాజరుపర్చింది.
ప్రస్తుతం ఎన్ఐఎ కోర్టుకు ఇన్ఛార్జిగా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి వ్యవహరిస్తున్నారు. నిందితుడిని తమ కస్టడికి అప్పగించాలని కోరుతూ కోర్టులో ఎన్ఐఎ పిటీషన్ దాఖలు చేసింది. ఇక నుండి ఈ కేసు విచారణను విజయవాడలోనే చేపట్టనున్నారు.
previous post