బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, అయోధ్యలో రామమందిరం ఈ రెండు పేర్లకు మూడు దశాబ్దాల నుంచి లింక్ ఉంది. రామమందిరం అనేది హిందువుల సెంటిమెంట్, హిందువుల విశ్వాసం, దాన్ని రగిల్చింది హిందువులలో ఆ ఆకాంక్షను ప్రేరేపించింది, రామమందిరానికి మొదట నాటు వేసింది మాత్రం అద్వానీ నే. మూడు దశాబ్దాల అయోధ్య రామ్ మందిర చరిత్రలో ఈ బిజెపి నాయకుడి పాత్ర చారిత్రాత్మకంగా మిగులులుతుంది. నేడు అయోధ్య రామమందిర శంకుస్థాపనకు ఎల్ కె అద్వానీ హాజరు కానప్పటికీ ఆయన పేరు మాత్రం అక్కడ, హిందు వాసుల గుండెల్లో చిరకాలం ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన కొన్ని జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ కీలకమైన వ్యాఖ్యలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన ఏమన్నారో ఆ బంధం ఏంటో ఒకసారి చూద్దాం.
భారత దేశ శక్తి, సుసంపన్నత, శాంతి సమరస్యాలకు అయోధ్య రామ మందిర నిర్మాణం అద్దంగా నిలుస్తుందని పేర్కొన్నారు అద్వానీ. రామమందిర శంకుస్థాపన దేశ ప్రజలతో పాటు తనకు చారిత్రాత్మకమైన భవోద్వేగ భరితమైన రోజు అని అద్వానీ అన్నారు. 1990లో బీజేపీ అధ్యక్షుడి హోదాలో అయోధ్య లో రామమందిరం నిర్మించాలన్న డిమాండ్ తో సోమనాథ్ నుండి అయోధ్యకు రామ్ రథయాత్ర చేపట్టిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు అద్వానీ. 30 ఏళ్ల తరువాత అద్వానీ ఉద్యమ లక్ష్యం నెరవేరింది. రథయాత్ర రూపంలో పవిత్ర కర్తవ్యాన్ని నిర్వహించే అవకాశాన్ని విధి తనకు కల్పించింది ఆధ్వర్యంలో పేర్కొన్నారు. దేశ సంస్కృతిలో శ్రీరాముడిది సమోన్నత మైన స్థానం అని, శ్రీరాముడి సుగుణాలను ప్రజలు అందరు అలవర్చుకునేలా ఆలయం చైతన్య పరుస్తుందని దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కొంత ఆలస్యం అయినప్పటికీ తన చిరకాలం స్వప్నం నెరవేరడం సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.
రామ జన్మభూమి అయోధ్యలో అద్భుతమైన రామ మందిరం నిర్మించాలన్నది బీజేపీ ఆకాంక్ష, లక్ష్యం అని పేర్కొంటూ రామ జన్మభూమి ఉద్యమంలో త్యాగాలు చేసిన, సహాయ సహకారాలను అందించిన సాధువులు, ప్రజలు, నాయకులకు ధన్యవాదములు తెలిపారు. ఓ పక్క వయోభారం, మరో పక్క కరోనా వ్యాప్తి కారణంగా అద్వానీ నేడు అయోధ్యలో జరిగిన భూమి పూజ కార్యక్రమానికి హాజరు కాలేదు.