ప్రపంచం మొత్తం కరోనా గురించిన చర్చ జరుగుతుంది… దేశంలోని రాష్ట్రాల్లో కరోనా కారణంగా పరిపాలన కునిపాట్లు పడుతుందని, కొన్ని రాష్ట్రాల్లో కరోనా పేరుచెప్పి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా తూతూమంత్రంగా సాగుతున్నాయని కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఒకపక్క కరోనా విలయతాండవం చేస్తున్నా… ఆ ప్రభావం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఏమాత్రం పడకుండా… కరోనాను ఒక సాకుగా కాకుండా ఒక సమస్యగా మాత్రమే చూస్తూ… తనదైన శైలిలో ముందుకుదూసుకుపోతున్నారు జగన్!
కరోనా వస్తుంది.. పోతుంది.. దానివల్ల రాష్ట్ర ఖజానాకు ఇబ్బంది వచ్చినా కూడా ఆ ఇబ్బంది ప్రజలపై పడకుండా చూస్తూ పాలన సాగించాలని ఫిక్సయిన జగన్… ఆదిశగానే ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా… మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పటి నుండి విద్యావ్యవస్థపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్… ప్రతి పేద పిల్లవాడికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్న సంగతి తెలిసిందే!
ఇందులో భాగంగా… వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్.కే.జీ. – యూ.కే.జీ. విద్య అమలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పీపీ-1 పీపీ-2గా ప్రీప్రైమరీ విద్యను అమలు చేయాలని చెప్పారు. ప్రైవేటూ పాఠశాలల దోపిడీ నుంచి పేదవారిని రక్షించే క్రమంలో భాగమో లేక ప్రభుత్వ విద్యావ్యవస్థను కాపాడాలనే లక్ష్యమో… అదీ గాక రెండూనో తెలియదు కానీ… అధికారం చేపట్టినప్పటినుంచీ… ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు జగన్! దీంతో… రాష్ట్రంలోని తల్లులంతా ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారంట!!