Telangana BJP: తెలంగాణ అసెంబ్లీ బీజేపీ ప్లోర్ లీడర్ గా ఏలేటి మహేశ్వరరెడ్డిని ఆ పార్టీ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ప్లోర్ లీడర్ తో పాటు మిగతా సభ్యులను కూడా హైకమాండ్ నియమించింది. డిప్యూటీ ప్లోర్ లీడర్ గా పాయల్ శంకర్, చీఫ్ విప్ గా పాల్వాయి హరీష్ బాబు, విప్ గా ధన్ పాల్ సూర్యనారాయణ, ట్రెజరర్ గా పైడి రాకేష్ రెడ్డి, ఆఫీస్ సెక్రటరీగా రామారావు పాటిల్ ను బీజేపీ అధిష్టానం నియమించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో బీజేపీ నుండి 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన సంగతి తెలిసిందే.
ఏలేటి మహేశ్వర రెడ్డి నిర్మల్ నుండి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట 2009 లో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గోషామహల్ నుండి గెలిచిన రాజాసింగ్ కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. ఎన్నికలు పూర్తై రెండు నెలలు దాటినా బీజేపీ ప్లోర్ లీడర్ ఎవరనే దానిపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వకపోవడంతో అనేక విమర్శలు వినిపించాయి.
సొంత పార్టీ నేతలు కూడా కొంత అసహానానికి గురయ్యారు. తెలంగాణ తో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా, ఆయా రాష్ట్రాల్లో ప్లోర్ లీడర్ ల ఎంపిక అప్పట్లో జరిగింది. తెలంగాణలో కేవలం 8 మంది సభ్యులే ఉన్నా ఎల్పీ లీడర్ ఎంపికలో ఆలస్యం జరిగింది. దీనిపై ఇటీవల గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం పార్టీకి ఏ మాత్రం మంచిది కాదని అన్నారు. ఎవరో ఒకరిని ప్లోర్ లీడర్ గా త్వరగా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తనకు ఆ పదవిపై ఆసక్తిలేదని చెప్పుకొచ్చారు.
Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ ..ఈ ఇద్దరికి జాక్ పాట్