Allu Arjun: అల్లు అర్జున్ కథానాయకుడిగా రష్మిక మందన హీరోయిన్ గా నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. కలెక్షన్లను పక్కనపెడితే దేశవ్యాప్తంగా ఈ సినిమా కి, అల్లు అర్జున్ కి వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండో భాగం షూటింగ్ ఇంకా మొదలు కావాల్సి ఉంది. వచ్చే సంవత్సరం ఈ చిత్రం రెండో భాగం రిలీజ్ ను ఆశించవచ్చు.
అయితే ఈ సినిమాపై ఈ మధ్యనా కొద్ది రోజులు ఒక వివాదం నడిచింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ స్వీకరించిన గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. పుష్ప సినిమాలో ఒక స్మగ్లర్ పాత్రను హీరోగా చూపించడం … సమాజానికి వీరు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. అలా ఒక స్మగ్లర్ ను హీరోగా చూపిస్తే ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని మాట్లాడడం జరిగింది.
ఇక పుష్ప చివరి భాగం అయిన పుష్ప ది రూల్ సినిమాలో గరికపాటి వ్యాఖ్యల నేపథ్యంలో సుకుమార్ స్క్రిప్ట్nlo మార్పులు చేస్తారన్న సందేహాలు కూడా అందరిలో నెలకొన్నాయి. ఈ చిత్రం షూటింగ్ ఇంకా పెద్దగా మొదలు కాలేదు కాబట్టి ఇప్పటి నుండే స్క్రిప్ట్ లో మార్పులు ఉండవచ్చని అంటున్నారు. అయితే దర్శకుడు క్రియేటివ్ గా ఆలోచించే వెసులుబాటు ఉంటుంది అసలు ఎలాంటి ఉద్దేశాలు ఏమీ ఈ చిత్ర బృందం చేయకపోవచ్చని మరికొందరి వాదన. మరి రెండో భాగం వస్తేగాని మనకి ఈ విషయం ఏమిటో పూర్తిగా అర్థం కాదు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!