భారత్ మరియు చైనా సరిహద్దు వద్ద నెలకొన్న తాజా పరిస్థితులపై స్పందించింది అమెరికా. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణాన్ని నిశితంగా గమనిస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా పేర్కొంది. ఉభయ దేశాల మధ్య ఉన్న సమస్యల విషయంలో సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచించింది. ఇదే టైమ్ లో చైనా కి వార్నింగ్ ఇచ్చే విధంగా అమెరికా విదేశాంగ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది.
గతంలో డోక్లాం లోను డ్రాగన్ కంట్రీ ఈ విధంగానే కుయుక్తులకు ఒడిగట్టింది అని అగ్రరాజ్యం వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ డైరెక్షన్ మార్చడానికి భారత్ చైనా సరిహద్దు వివాదాన్ని తెరపైకి తీసుకురావడానికి చైనా ఈ గొడవకు పాల్పడిందని అమెరికా భావిస్తోంది. అంతేకాకుండా త్వరలో ఇండియా చుట్టూ చైనా తన స్థానిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిందని దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నట్లు అమెరికా చెప్పు కోచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే అటు నేపాల్ మరియు పాకిస్తాన్ దేశాలను భారత్ పై ఉసీగోల్పడానికి చైనా రెడీ అవుతున్నట్లు కూడా ఆరోపిస్తోంది అమెరికా.