Anandaiah medicine: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తన కరోనా మందు తో సక్సెస్ అయ్యాడు. అటు ప్రభుత్వాలు, ఇటు కోర్టు దీనికి ఆమోదం తెలపడంతో ప్రజలంతా ఈ మందు కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం అధికార పక్షం ఉచితంగా ఇస్తామని ప్రకటించిన ఈ మందు పేరు పై సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి నెల్లూరు జిల్లా కీలక నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృష్ణపట్నం ఆనందయ్య మంది పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. చారిత్రాత్మకమైన ఆనందయ్య పేరుతో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఆనందయ్య తన మందుని ముందు నుండి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. తర్వాత కూడా ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం సాయం అందిస్తామని కూడా తెలిపింది.
అయితే శ్రేషిత టెక్నాలజీ వద్ద వెబ్సైట్ ఒకటి కొని ఇంటర్నెట్ లో అన్నయ్య మందుకి హోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసినట్లు సోమిరెడ్డి ఆరోపించారు. మొదట ఆనందయ్య మందు 15 రూపాయలు అని చెప్పి ఆ తర్వాత రూ.167 చేశారని ఆయన మండిపడ్డారు. శ్రేషిత కంపెనీ వైసిపి నాయకులది అని చెప్పిన సోమిరెడ్డి కోటిమందికి ఆన్లైన్లో ఈ మందును అమ్మి దాదాపు 120 కోట్లు సొమ్ము చేసుకునేందుకు కాకాని ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
వెబ్ సైట్ క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సోమిరెడ్డి. ఇక ఈయన ఇలా మాట్లాడడంతో ఆనందయ్య మందు అసలు ఉచితంగా వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. నిజంగానే ఈ మందు వెనుక 120 కోట్ల వ్యాపారం దాగి ఉంది అంటే ప్రజలకు ఇది ఉచితంగా చేరే అవకాశాలు తక్కువే.