కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఏపీలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వెంటనే వారితోపాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. కరోనా విస్తరణ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల రక్షణను దృష్టిలో ఉంచుకొని వచ్చేనెలలో నిర్వహించాలనుకున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నామని సురేష్ పేర్కొన్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసిన తర్వాత ఏపీ ప్రభుత్వం మాత్రం కెసిఆర్ బాటలో తమ నడవమని…. కచ్చితంగా పదోతరగతి పరీక్షలు పెట్టే తీరుతామని ప్రకటించారు. అయితే ఆ తర్వాత నుంచి కేసులు తీవ్రస్థాయిలో పెరగడంతో వేరే దారి లేక పదో తరగతి పరీక్షల తోపాటు ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సురేష్ ప్రకటించారు.
అంతేకాదు 2019-2020 విద్యాసంవత్సరంలో ఫెయిల్ అయిన ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులను పాస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సప్లిమెంటరీ ఫీజు ఇచ్చిన వారికి వెనక్కి ఇచ్చేస్తామని విద్యాశాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ యథాతథంగా జరుగుతాయని.. విద్యార్థులు ఆ అవకాశాన్నికూడా వినియోగించుకోవచ్చునని అన్నారు.