అమరావతి: క్యాబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యంకు సమాచారం అందించారు. వెంటనే సిఎస్ ఎల్ వి సుబ్రమణ్యం సిఎంఒ కార్యాలయానికి ఈ విషయాన్ని తెలియజేశారు.
మంగళవాం క్యాబినెట్ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. క్యాబినెట్ మంత్రులకు సమాచారం అందించారు.
ఫణి తుఫాన్ ప్రభావం,కరువు,తాగునీటి ఎద్దడి,నరేగా కూలీల సమస్యలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నట్లు ఎజెండా ద్వారా తెలుస్తోంది.