(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
అమరావతి రాజధాని భూముల విషయంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం ప్రత్యక దర్యాప్తు (సిట్) బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్లు సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు ఏపి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. సిట్ విచారణపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
గత చంద్రబాబు ప్రభుత్వంలోని అక్రమాలపై దర్యాప్తును చేసేందుకు సీనియర్ ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో పది మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికలోని అంశాల అధారంగా దర్యాప్తును జరిపి చార్జి షీటు దాఖలు చేసే అధికారాలను సిట్కు కట్టబెట్టింది ప్రభుత్వం.
సిట్ ఏర్పాటును సవాల్ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై గత బుధవారం ఇరుపక్షాల వాదనలు పూర్తి అయ్యాయి. గత బుధవారం తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు నేడు సిట్ విచారణను నిలుపదల చేస్తూ తీర్పు ఇచ్చింది.