అమరావతి : మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నేడు హైదరబాద్ నుంచి అమరావతికి బయలు దేరారు. ముందు షెడ్యూల్ ప్రకారం విశాఖకు వెళ్లాల్సి ఉన్నా, చివరి నిముషంలో పర్యటన రద్దయింది. విశాఖలో చంద్రబాబు పర్యటనకు ప్రభుత్వ అనుమతి లభించినప్పటికీ విశాఖ విమాన సర్వీసులు రద్దు కావడంతో చంద్రబాబు హైదరాబాద్లో తన నివాసం నుంచి అమరావతికి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మధ్యాహ్నం అమరావతికి చేరుకునే అవకాశం ఉంది. చంద్రబాబు వెంట ఆయన తనయుడు లోకేష్, పిఏ ఉన్నారు.
కరోనా నేపథ్యంలో 65 రోజుల తర్వాత చంద్రబాబు అమరావతిలో అడుగుపెడుతున్నారు.