Egypt Mummy: ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమందికి ఈజిప్ట్ మమ్మీలు అంటే చాలా ఆసక్తి. ఈ ఈజిప్ట్ మమ్మీలపై కొన్ని వందల సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి అలాగే ఎన్నో ఆసక్తి కర విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వందల సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నా, ఇంకా ఎన్నో మిస్టర్ లు అలానే ఉన్నాయి. అయితే ఈజిప్ట్ ప్రజలు కూడా హిందువుల లాగా పునర్జన్మ ఉంటుందని నమ్ముతుంటారు.
అంతేకాకుండా ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఈ మమ్మీల్లో కొన్ని చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయంటే అప్పటి ప్రజలు ఎంతటి సాంకేతికత తో ఉండేవారో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈజిప్టు లోని రాజకుటుంబీకుల విషయానికి వస్తే, వారు మరణించినప్పుడు వారి సమాధుల్లో పార్థివ దేహాలతో పాటుగా చనిపోయిన వారికి నచ్చిన వస్తువులు, ఆహార పదార్థాలతో పాటుగా కొన్ని విలువైన వస్తువులను కూడా అందులో పెట్టి పాతిపెట్టేవారట.
తాజాగా పురాతత్వ శాస్త్రవేత్తలకి “గ్రేట్ టోంబ్ ఆఫ్ ఓసిరిస్” లో తవ్వినప్పుడు ఇటువంటి ఓ మమ్మీ కనిపించింది. ఈ మమ్మీ 2,000 ఏళ్ల పురాతనమైనది. ఆ మమ్మీ నోట్లో వారికి ఓ బంగారు నాలుక కనిపించిందట. వారి నమ్మకాల ప్రకారం చనిపోయాక ఆత్మలు సమాధుల్లోకి తిరిగి వచ్చి దేవుళ్లతో, ఇతర ఆత్మలతో మాట్లాడతాయని అందుకు నాలుక అవసరం అవుతుంది కాబట్టి బంగారు నాలుకను ఇలా ఆ మమ్మీ నోట్లో పెట్టి ఉండవచ్చు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
పురాతత్వ శాస్త్రవేత్తలకి ఈ మమ్మీ లభించిన సమీపంలోనే ఓసిరిస్ అనే ఈజిప్ట్ ప్రజల దేవత గుడి కూడా ఉందట. మరణానంతరం చనిపోయిన ఆమె ఒకవేళ ఆ దేవతను కలిస్తే అప్పుడు మాట్లాడడానికి ఆమెకు నాలుక ఉండదని భావించి ఇలా బంగారు నాలుకను మమ్మిఫికేషన్ లో భాగంగానే ఆ మమ్మీలో పెట్టినట్టు ఈజిప్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.