Vishakapatanam : అన్యాయంగా రాష్ట్ర విభజన చేసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన హామీల లో బీజేపీ సర్కార్ చాలావరకూ శత కోపం పెట్టిన సంగతి తెలిసిందే.
ఏపీకి న్యాయపరంగా రావాల్సిన స్పెషల్ స్టేటస్ విషయంలో స్పెషల్ ప్యాకేజీ అంటూ ఆంధ్ర ను మోసం చేసిన బిజెపి ఆర్థికంగా ఆదుకునే విషయంలో కూడా మొండి చేయి చూపిస్తూ వస్తుంది. ఇటీవల బడ్జెట్ విషయంలో కూడా ఇదే స్పష్టం అవ్వడం జరిగింది. ఎక్కడా కూడా రాష్ట్రానికి పెద్దగా కేటాయింపులు లేకుండా కేవలం దేశంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ పెడుతూ నిధులను కుమ్మరించినట్టు స్పష్టంగా బడ్జెట్ లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నీ ప్రైవేటీకరణ చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం విశాఖ వాసులకు ఎంతగానో కోపం పుట్టించిన సంగతి తెలిసిందే. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో విశాఖలో ఉన్న కార్మిక సంఘాలన్నీ రోడ్డెక్కి ఆందోళనలు, నిరసనలు చేపడుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే విశాఖ విషయంలో మరో టోపీ పెట్టడానికి కేంద్రం రెడీ అయినట్లు తాజా పరిణామాలు బట్టి వార్తలు వినబడుతున్నాయి. మేటర్ ఏమిటంటే ఇటీవల రాజ్యసభలో విశాఖ రైల్వే జోన్ విషయంలో ఎంపీ జీవీఎల్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ని క్లారిటీ అడగగా.. ఆయన ఇచ్చిన సమాధానం ఈ విధంగా ఉంది. విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి ఎటువంటి కాలపరిమితి లేదని కామెంట్ చేశారు. విశాఖ రైల్వే జోన్ డీపీఆర్ పై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని.. జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పనిచేస్తున్నారని తెలిపారు. సో మొత్తం మీద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటలు బట్టి చూస్తే విశాఖ రైల్వే జోన్ కూడా ప్రత్యేక హోదా మాదిరిగానే పక్కన పెట్టే రీతిలో ఏపీ మరో టోపీ పెట్టడానికి కేంద్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.