ఎన్నికలకు ముందు విశాఖ తెలుగుదేశం పార్టీలో ఇప్పటి వరకు ఉన్న అసమ్మతి సెగలు ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. మాజీ మంత్రి విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజకీయం గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎక్కడ అధికారం ఉంటే అక్కడే వాలిపోతూ ఉంటారు. ప్రజారాజ్యం నుంచి గెలిచి ఆ పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో అక్కడ మంత్రిగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత టిడిపిలోకి జంప్ చేసి ఎక్కడ కూడా ఐదేళ్లపాటు అధికారం ఎంజాయ్ చేశారు. గత ఎన్నికలలో గంటా ఎమ్మెల్యేగా గెలిచినా తెలుగుదేశం అధికారంలోకి రాకపోవడంతో ఐదేళ్లు సైలెంట్ గా ఉండిపోయారు.
మధ్యలో పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. పార్టీకి చెందిన ఎంతో మంది కీలక నేతలు బయటకు వచ్చి పోరాటాలు చేశారు. విశాఖ జిల్లాకే చెందిన మరో సీనియర్ నేత అయిన పాత్రుడు పార్టీ కోసం ఎంతో ఫైట్ చేసి ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఆ టైంలో కూడా గంట బయటకు వచ్చింది లేదు. అయితే ఇప్పుడు ఎన్నికల టైంలో గంటా హడావుడి మొదలైంది. మళ్లీ ఏపీలో టిడిపి అధికారంలోకి వస్తే మంత్రి పదవి కొట్టేసి రాజకీయం ఎంజాయ్ చేయాలన్నదే గంటా ఆలోచన. అయితే గంటా తీరును సొంత జిల్లాకే చెందిన టిడిపి నేతలు తట్టుకోలేకపోతున్నారు.
తాజాగా విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న లోకేష్ ముందే లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ గంటాపై తీవ్రవ్యఖ్యలు చేసి ఘోరంగా అవమానించినట్టు తెలుస్తోంది. నారా లోకేష్ ఉత్తర నియోజకవర్గం లోని బిర్లా జంక్షన్ వద్ద సోమవారం నిర్వహించిన శంఖారావం సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. టిడిపి విశాఖపట్నం పార్లమెంట్ ఇన్చార్జ్గా ఉన్న శ్రీ భరత్ గంటాపై ప్రత్యక్షంగానే విమర్శలు గుర్తించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీకు అందుబాటులో లేకపోయినా మేం అండగా ఉంటామని భరత్ చెప్పారు.
ప్రజల సమస్యలను తీర్చుతామంటూ వేదికపై గంటా సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో గంటా తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వేదికపై ఉన్న నేతలతో పాటు కార్యకర్తలు సైతం భరత్ వ్యాఖ్యలపై షాక్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఉత్తర నియోజకవర్గంలోని టిడిపి నేతలు కార్యకర్తలు మాత్రం భరత్ చేసిన వ్యాఖ్యలలో తప్పేముందని చర్చించుకోవడం కోసమెరుపు. ఇప్పటికే నార్త్ నియోజకవర్గ పార్టీ కేడర్లో గంటాపై పూర్తిగా విశ్వాసం పోయింది.
మరోవైపు ఉత్తరం నియోజకవర్గ ఇన్చార్జిగా తమకు బాధ్యతలు అప్పగించాలంటూ టిడిపి రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి ఇతలపాక సుజాత స్వయంగా గంటాకి వినతిపత్రం అందించారు. గంటాను ఇక్కడ ఇన్చార్జ్గా తప్పుకోవాలన్నదే కదా దీనర్థం. ఇక ప్రతి ఎన్నికకు నియోజకవర్గ మారే గంటా ఈసారి కూడా ఉత్తర నియోజకవర్గం నుంచి భీమిలి వైపు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇందుకు లోకేష్ ఎంత మాత్రం ఒప్పుకోవటం లేదని తెలుస్తోంది. ఏది ఏమైనా టిడిపిలో మునుపటిలా ఈసారి గంటా పప్పులు ఉడికే పరిస్థితి అయితే కనపడటం లేదు.