ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అన్నట్లుగా తయారైంది జగన్ పరిస్థితి. బయటనుంచి వచ్చే సమస్యలు పెద్దగా లేకపోవడం అదృష్టం అనుకోవాలో లేక ఇంటి జనమే ఇబ్బందులు కలిగించడం దురదృష్టం అనుకోవాలో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితికి కొండకింద ఆర్.ఆర్.ఆర్. ఒక సమస్యగా ఉంటే.. కొండపైన రమణ దీక్షితులు మరో సమస్యగా తయారయ్యారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి కారణం.. తాజాగా ఆయన బహిరంగంగా చేసిన కామెంట్లే!
వివరాళ్లోకి వెళ్తే… తిరుమల శ్రీవారి మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు గత ప్రభుత్వ హయాంలో బాబుపై ప్రధానప్రతిపక్ష హోదాను మించిన ఆరోపణలు చేశారు. శ్రీవారి పింక్ డైమండ్ కనిపించడం లేదంటూ చేసిన హడావిడి దేశ వ్యాప్తంగా సంచనలంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… జగన్ కు దగ్గరయ్యేలా చేసుకున్నారు దీక్షితులు. అక్కడితో ఆగకుండా… జగన్ అధికారంలోకి వచ్చేందుకుగాను తాను స్వయంగా యాగాలు చేస్తానని ప్రకటించారు. దీంతో మ్యాటర్ క్లియర్.. దానికి రమణ దీక్షితులు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు… జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నారు! ఈ క్రమంలో ఏమైందో తెలియదు కానీ.. బహిరంగంగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు!
వంశపారంపర్య పురోహిత వ్యవస్థకు తిరిగి జీవంపోయడం ద్వారా రమణ దీక్షితులికి మరో అవకాశం ఇచ్చిన జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు దీక్షితులు. తిరుమల అర్చకుల్లో 15 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. తాము శ్రీవారి దర్శనాలను పూర్తిగా నిలిపివేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని.. ఇలానే వదిలేస్తే తిరుమల భ్రష్టుపట్టి పోతుందని రమణ దీక్షితులు తన ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా సీఎం జగన్ ఈ విషయంలో మౌనం పాటించడం సరికాదని సూచించారు.
అధికారికంగా టీటీడీలో పదవి ఉన్న దీక్షితులు.. ఇలా బహిరంగ వేదికలపైకి వచ్చి కామెంట్లు చేయడంపై వైవీ సుబ్బారెడ్డి స్పందించడం.. ఆయన మాటలను ఖండించడం జరిగిపోయింది. ఈ యవ్వారం ఇలా మారడంతో… జగన్ సొంత మనుష్యులము, జగన్ ఇంటి మనుష్యులము అని చెప్పుకునేవారే ఇలా జగన్ కు “ఇంటిపోరు” తేవండం దురదృష్టం కాక మరేమిటనే కొందరి నోట నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి! మరికొందరైతే… ఈయన వ్యవహారాన్ని “కోరి తెచ్చుకున్న కష్టం” గా అభివర్ణిస్తున్నారు! జగన్ కూడా అదే భావిస్తే మాత్రం… రమణ దీక్షితులకు బ్యాడ్ టైం స్టార్ అయినట్లే అని పలురువు అభిప్రాయపడుతున్నారు!