బిగ్బాస్ ఇంటిలో ఏలిమినేషన్ ప్రక్రియ ఎప్పటిలాగా కాకుండా కొద్దిగా స్పెషల్ గా చేస్తున్నారు. ప్రతిసారి లాగా కాకుండా ఈసారి మిగిలిపోయిన ఇద్దరు కంటెస్టెంట్స్ అయిన కుమార్ సాయి, మోనాల్ గజ్జర్ లను ఇంటి సభ్యుల నుండి దూరం చేసి కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు. ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంతకీ అప్పుడు ఏం జరిగిందంటే…. ఇంటి సభ్యులతో ఫన్ డే అని జోష్ ఆడిస్తూ మధ్య మధ్యలో కంటెస్టెంట్స్ ని సేవ్ చేశారు. ముందుగా అఖిల్, దివి, అభిజిత్, అరియానా సేవ్ అయిపోయారు.
ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన కొత్త ట్విస్ట్ తో అందరూ షాక్ తిన్నారు. ముందుగా మోనాల్ ని కన్ఫెషన్ రూమ్ లోనికి రమ్మన్నారు. వెంటనే అఖిల్ గుండె ఝల్లుమంది. సభ్యులు కూడా ఊహించని ఈ నిర్ణయంతో ఎమోషనల్ అయిపోయిన వారిద్దరిని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక ఇంటిలోని కుమార్ సాయి ఎలిమినేట్ అవుతారని ప్రకటించేశారు. ఇంట్లోకి వచ్చిన మోనాల్ సేఫ్ అని ప్రకటించారు. రూమ్ లోనే ఉండమని కుమార్ కి సూచించారు. ఆ తర్వాత కుమార్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.
ఇక కుమార్ సాయి ఆశించినంత స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోవడం…. అలాగే ఎప్పుడూ డల్ గా ఉండటం, అనవసరమైన విషయాలకు రియాక్ట్ అవుతుండడం మైనస్ లు గా చెప్పొచ్చు. అయితే అతను అలా అని ఎవరితోనూ పెద్దగా గొడవలు పెట్టుకున్న సందర్భాలు కూడా లేవు. ఇక కుమార్ వెళ్ళే సమయంలో బిగ్ బాంబు అవకాశాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు. ఇంటిలో బాత్రూం లు క్లీన్ గా లేవు అని కంప్లైంట్ వచ్చింది అని నాగార్జున చెప్పి ఈ వారం బిగ్ బాంబ్ ఒక వారం పాటు బాత్ రూం లు క్లీన్ చేయాలి అని రూల్ పెట్టారు. దాంతో బిగ్ బాంబ్ అమ్మ రాజశేఖర్ పై వేసి ఇంటి పెద్దగా ఈ పని చేయమని కుమార్ చెప్పాడు.