Big Breaking: గుజరాత్ తదుపరి ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆదివారం భూపేంద్ర రజనీకాంత్ పటేల్ని ఎంపిక చేసింది. ఆదివారం నిర్వహించిన బిజెపి కోర్ కమిటీ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకున్నది. భూపేంద్ర పటేల్ పేరును విజయ రూపాని ప్రతిపాదించగా బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ నిన్న తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో రాజకీయ సమీకరణల నేపథ్యంలో పటేల్ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయ్ రూపాణీ తన రాజీనామా లేఖను నిన్న రాజ్ భవన్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు సమర్పించారు. భూపేంద్ర పటేల్ ఘట్లోడియా నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రేపు కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త సీఎం ఎంపిక కోసం ఆదివారం జరిగిన బీజేపీ ఎల్పీ సమావేశానికి పార్టీ పరిశీలకులుగా కేంద్ర మంత్రులు తోమర్, ప్లహాద్ జోషిలు పాల్గొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో బీజేపీ మరో సారి అధికారంలోకి వచ్చేందుకు గానూ ఈ మార్పులకు శ్రీకారం చుట్టినట్లు రాజకీయ విష్లేషకులు పేర్కొంటున్నారు.