బిగ్ బాస్ సీజన్ ఫోర్ దాదాపు 12 వారాలు ఆట ముగించుకొని 13వ వారం లో కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో గేమ్ ముగియనున్న క్రమంలో హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. మరోపక్క బిగ్ బాస్ కూడా ఇంటి సభ్యుల స్ట్రాటజీ లు తలకిందులు అయ్యేలా హౌస్ లో వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
ఇదిలా ఉంటే మొదటి నుండి హౌస్ లో జరుగుతున్న టాస్క్ ల విషయంలో అనేక విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అవే టాస్క్ లు రిపీట్ చేస్తున్నారని, సీజన్ మారినా గాని కొత్త గేములు ఇంటి సభ్యుల చేత ఆడించడం లేదని దీనివల్ల షో చూడటానికి కూడా బోర్ కొడుతుంది అనే విమర్శలు మొదటి నుండి వస్తూనే ఉన్నాయి.
కాగా సీజన్ క్లైమాక్స్ కి చేరుకున్న టాస్క్ లలో కొత్తదనం లేకుండా షో నిర్వాహకులు ఇంటి సభ్యుల చేత ఆడిస్తున్న గేములు పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. సీజన్ త్రీ లో టాప్ గేమ్ కాగా సీజన్ ఫోర్ లో ఆవు దగ్గర పాలు పిండుకోడం. అదేవిధంగా ఫ్లవర్ టాస్క్ ఇంకా గతంలో జరిగిన అనేక గేములు పాతవే అని ఆడియన్స్ మండిపడుతున్నారు. ఇంకా మిగిలి ఉన్న మూడు వారాలలో ఇంటి సభ్యుల చేత కొత్త గేమ్స్ ఆడిస్తే బాగుంటుందని షో నిర్వాహకులకు బయట జనం ఆడియన్స్ సూచిస్తున్నారు.