Bigg Boss 5 Telugu: యూట్యూబ్ స్టార్ గా తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న షణ్ముఖ్ జస్వంత్.. బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఫైవ్ లో కీలక కంటెస్టెంట్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. హౌస్లో ప్రారంభంలో చాలా స్లో గా గేమ్ ఆడిన షణ్ముఖ్ జస్వంత్… నాలుగో వారం నుండి.. రెచ్చిపోతున్నాడు. ఎవరికి వారు వేస్తున్న స్ట్రాటజీ లకు భిన్నంగా.. తనకంటూ సెపరేట్ గ్రూప్ హౌస్లో క్రియేట్ చేసుకుని.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తన గ్రూపులో జేస్సితో పాటు.. మొదటి నుండి తన బెస్ట్ ఫ్రెండ్ సిరినీ.. కలుపుకొని గేమ్ ఆడుతూ ఉన్నాడు. దీంతో ఈ ముగ్గురు నిధి లో ఉండే నానాలు కొట్టేయడం లో.. బిజీబిజీగా గడుపుతు ఎలాగైనా రవి జట్టులో.. కొంతమంది నీ.. టార్గెట్ చేసుకుని వాళ్లు.. కెప్టెన్సీ పోటీదారుల లో ఉండకూడదు అని డిసైడ్ అయ్యారు.
“రాజ్యానికి ఒక్కడే రాజు” అనే టాస్క్ లో…
ఈ క్రమంలో “రాజ్యానికి ఒక్కడే రాజు” అనే టాస్క్ లో చివరి ఘట్టంలో.. బిగ్ బాస్.. ఎవరి దగ్గర ఎన్ని నాణేలు ఉన్నాయో వెల్లడించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో సన్నీ దగ్గర 30, ఆయన రాజ్యంలోని మానస్ దగ్గర 240, షణ్ముఖ్ దగ్గర 220, జెస్సీ దగ్గర 209 నాణాలున్నాయి. రవి రాజు దగ్గర 50, అతడి రాజ్యంలోని యానీ మాస్టర్ దగ్గర 176, హమీదా దగ్గర 60, విశ్వ దగ్గర 10, శ్రీరామచంద్ర దగ్గర 52 నాణాలున్నాయని తెలిపారు. నాణాల లెక్కింపు తర్వాత బిగ్బాస్ ఇంటిసభ్యులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు.
హమిదా… తన స్థానాన్ని త్యాగం చేసి ప్రియా కి ఇవ్వటం…
ఇంటిలో ఎవరైతే రాజు అవుతాడో ఆ రాజు వేరే రాజుకు మద్దతు తెలపని లేకపోతే తన.. సామ్రాజ్యానికి చెందిన ప్రజలకి.. మద్దతు ఇవ్వొచ్చని తెలపడంతో రవి టాస్క్ లో గెలవడంతో.. తన సామ్రాజ్యానికి చెందిన..యానీ, హమీదా, శ్వేత నీ.. సెలెక్ట్ చేయటంతో .. జెస్సీ, షణ్ముక్, సిరి వేసిన పంటలు మొత్తం తలకిందులయ్యాయి. అంత మాత్రమే కాక వీళ్లు దొంగిలించిన నాణాలు కూడా రవి వశమయ్యాయి. ఈ క్రమంలో కెప్టెన్ గా ప్రియా కూడా పోటీ చేయవచ్చని బిగ్ బాస్ సరికొత్త ఆదేశాలు ఇవ్వడంతో హమిదా… తన స్థానాన్ని త్యాగం చేసి ప్రియా కి ఇవ్వటం జరిగింది. అయితే ఈ కెప్టెన్సీ పోటీలో.. ప్రియా గెలిచినట్లు లీక్ వార్తలు వినబడుతున్నాయి.