‘పల్లెకు పోదాం ఛలో ఛలో’ టాస్క్ లో ఇంటి సభ్యులు ఎవరికి వారు ఆస్కార్ రేంజ్ లో రెచ్చిపోయారు. పల్లెకు పోదాం అనే టాస్క్ అనేక అప్పటికి ప్రతి ఒక్కరికీ ఆహ్లాద వాతావరణం అనే భావన కలుగుతుంది. కానీ బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ లు ఇవ్వటంతో ఇంటిలో చేపల మార్కెట్ గొడవలు అన్నట్టు తయారయింది. ఎక్కడికక్కడ గొడవలు జరగటంతో 61వ ఎపిసోడ్ చూస్తున్న ఆడియన్స్ కి పెద్ద తలనొప్పిగా మారింది.
ఫుడ్ విషయంలో అరియానా-అభిజిత్ల మధ్య గొడవ జరగగా… అభిజిత్ ఓ రేంజ్ లో అరియానా పై ఫైర్ అయ్యాడు. ఇదే టైమ్ లో పాన్ షాప్ దగ్గర అవినాష్- హారిక మధ్య జరిగిన గొడవ ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. అదేవిధంగా కిచెన్ టీంలో ఉన్న అభిజిత్, మోనాల్ దగ్గర ఫుడ్ విషయంలో అరియానా కి గొడవ జరిగిన తర్వాత అమ్మ రాజశేఖర్ కి కూడా గొడవ జరిగింది.
ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ ఎప్పటిలాగానే మరింతగా అభిజిత్ మీద సీరియస్ అయిపోయి నీ ఫుడ్ నీ దగ్గరే ఉంచుకో అంటూ మోనాల్ చేతిలో ఫుడ్ని లాగేయడంతో ఫుడ్ నేలపాలైంది. ఇలా చేయడం తప్పు మాస్టర్ అని అభిజిత్ వాదించాడు. అదేవిధంగా పాన్ షాప్ దగ్గర గొడవ జరిగిన టైములో… షాపు మొత్తాన్ని అవినాష్ కిందపడేసిన తరుణంలో పాన్ డబ్బాను విసిరి కొట్టడంతో అది వెళ్లి మెహబూబ్కి తగిలింది. ఇంత గొడవ జరుగుతున్నా ఊరి పెద్ద మనిషి వాళ్లని కంట్రోల్ చేయడం లేదని కళ్లు దొబ్బాయా అంటూ సొహైల్పై పుచ్చకాయ పగులుతుంది అనే తరహా లో డైలాగ్ వేశాడు. మొత్తానికి పల్లెకు టాస్క్ కాస్త పంచాయతీల టాస్క్ అయ్యింది.