Bihar: బీహార్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే మహాకూటమి నుండి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్దమైయ్యారు సీఎం నితీశ్ కుమార్. ఈ క్రమంలో భాగంగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. మహాకూటమితో సంబంధాలు తెంచుకున్నట్లు తెలిపి బీజేపీతో జతకట్టేందుకు సిద్దమైనట్లు తెలిపారు.
నితీశ్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగ కొనసాగాలని కోరారు. ఈ రోజు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ .. సీఎం పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ ను కోరినట్లుగా చెప్పారు.
అన్ని వర్గాల సూచనలు పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు అని వ్యాఖ్యానించారు. నేతల వైఖరి సరిగా లేనందున చాలా మంది ఇబ్బంది పడ్డారన్నారు. మహాకూటమితో సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించామని నితీశ్ కుమార్ పేర్కొన్నారు. అంతకు ముందు నితిశ్ కుమార్ నివాసంలో జేడీయూ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి జేడీయూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు హజరైయ్యారు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రతిపాదనకు బీజేపీ, జేడీయూ సహా ఇతర మిత్ర పక్షాల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరిని లెజిస్లేటివ్ పార్టీ నేతగా, విజయ్ సిన్హాను డిప్యూటి లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు.
మరో వైపు నితీశ్ కుమార్ రాజీనామా వ్యవహారంపై కాంగ్రెస్ స్పందించింది. నితీశ్ ను ఊసరవెల్లితో పోల్చింది. ఆయన చేసిన ద్రోహాన్ని రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని, నితీశ్ చేసిన పనిని తప్పుబట్టింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర కు ప్రధాని మోడీ, బీజేపీ భయపడ్డాయని, అందుకే ఆ యాత్ర నుండి దృష్టి మళ్లించడానికి ఈ నాటకానికి తెరలేపాయని కాంగ్రెస్ ఆరోపించింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దీనిపై స్పందిస్తూ ఇలా జరుగుతుందని లాలూ ప్రసాద్ యాదవ్ ఇది వరకే హింట్ ఇచ్చారని చెప్పారు. అదే ఈ రోజు నిజమైందని అన్నారు. ఇలాంటి వ్యక్తులు దేశంలో చాలా మంది ఉంటారని అన్నారు.
Galla Jayadev: టీడీపీకి బిగ్ షాక్ .. అజ్ఞాతవాసంకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్