బీజేపీ నంది అంటే నంది అనాలి… పంది అంటే పంది అనాల్సిందే.. ఆలా కాకుండా వాదిస్తే, అక్కడున్నది పంది కాదు కదా అని ఎదురు ప్రశ్న వేస్తే చాలు మనం జాతీయ వాదాన్ని తెరపైకి తెస్తారు. దేశ భక్తి లేని వాళ్ళను చేస్తారనేది రాజకీయ వర్గాల్లో ఉన్న పెద్ద జోక్… ప్రతి అంశానికి, వారికీ నచ్చని వాటికీ వెనుక జాతీయవాదం అనే పదం తగిలించి వివాదం చేయడం వారికీ అలవాటే. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఓటిటి ప్లాట్ ఫార్మ్ మీద బీజేపీ కన్ను పడింది. అందుకేలోనూ నెట్ ఫ్లిక్స్ ఓటిటి పై బీజేపీ మంది పడుతోంది. ఇటీవల అందులో వచ్చిన పలు కంటెంట్ లు భారతీయ జీవన విధానం, హిందూ మతం మీద వచ్చిన వివిధ రకాల కాంటెంట్లు మీద బీజేపీ అభ్యన్తరం చెబుతూ, నెట్ ఫ్లిక్స్ తీరు మీద గుర్రుగా ఉంది..
** ఇటీవల ఓటిటి కంటెంట్ ల మీద సైతం నిఘా ఉండాలని, సెన్సార్ ఉండాలని కేంద్ర సామ్ సమాచారశాఖ అప్పటికి అప్పుడు ఓ విషయాన్నీ చర్చకు పెట్టడం ఇప్పుడు కొత్త విషయాలను తెరపైకి తెస్తోంది .. ఈ ప్రకటన పూర్తి సారాంశం తర్వాత చుసిన, అసలు విషయం మాత్రం నెట్ ఫ్లిక్స్ అనేది ఇప్పుడు వినబడుతున్న మాట.
** నెట్ ఫ్లిక్స్ అనేది స్వతంత్ర సంస్థ కాదు. కేవలం ఒక ప్లాట్ ఫార్మ్. నిర్మాతలు సినిమాలు తీసి ఎక్కడ రిలీజ్ చేసి డబ్బులు సంపాదన చేస్తారు. నెట్ ఫ్లిక్స్ కు కేవలం దానిలో కొంత మొత్తం కమిషన్ మాత్రమే వెళ్తుంది.
** ఈ ప్లాట్ ఫార్మ్ అమెరికాకు చెందిన ఓ కంపెనీ. అక్కడ నుంచి కొందరు పెద్దలు బీజేపీ కు వ్యతిరేకంగా, హిందూ మతాన్ని కించ పరిచేలా సినిమాలు, సిరీస్ లు తీస్తున్నారని బీజేపీ ఆరోపణ. కావాలనే ఎక్కువ ఈ ఓటిటి ప్లాట్ ఫార్మ్ మీదనే ఎక్కువగా హిందూ వ్యతిరేక కాంటెంట్లు వస్తున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది.
** అనురాగ్ కశ్యప్ వంటి బీజేపీ వ్యతిరేక మేధావులతో పాటు, సిఏఏ ఎన్ఆర్సి ఆందోళనల్లో పాల్గున్న కొందరు సైతం హిందూ మాత వ్యతిరేక భావజాలాన్ని కంటెంట్ ల కోసాం ఎంచుకుంటున్నారని బీజేపీ భావిస్తోంది. అంతే కాకా హిందూ ఆలయల వద్ద ముద్దులు పెట్టుకునే సన్నివేశాలు, సెక్స్ సీన్లు తీస్తూ హిందూ వ్యతిరేకతను, మతాన్ని కించపరుస్తున్నారని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి సినిమాలు, సిరీస్ లు అన్ని నెట్ ఫ్లిక్స్ వేదికగా వస్తూన్నాయని బీజేపీ గుర్తించింది.
** ఓటిటి ప్లాట్ ఫార్మ్ మీద విడుదల అవుతున్న వాటిలో దేని మీద సెన్సార్ ఉండదు. దింతో అవి నేరుగా ఇంటికే వచ్చేలా తీరు ఉందని, ఇది ఎంత మాత్రం సరికాదు అనేది బీజేపీ వాదన.
నెట్ ఫ్లిక్స్ మీద ఉన్న మొత్తం కోపానికి తగ్గట్టుగా మొత్తం ఓటిటి వేదికల మీదనే నిఘా పెడితే మంచిదనే వరకు విషయం వెళ్లినట్లు తెలుస్తోంది.