సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక జవాను పాడిన పాట ఇప్పుడు ట్విట్టర్లో వైరల్ అవుతోంది. 1997లో వచ్చిన ‘బోర్డర్’ చిత్రంలోని ‘మై వాపస్ ఆవూంగా’ పాటను బిఎస్ఎఫ్ జవాను సురీందర్ సింగ్ పాడుతుండగా సహచర జవాన్లు చప్పట్లు కొడుతూ ప్రోత్సహిస్తూ ఉంటారు. అనితా చౌహాన్ అనే మహిళ తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు.
అప్పటి నుంచీ రీట్వీట్లు మొదలయ్యాయి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వీడియోను రీట్వీట్ చేశారు. ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. వేలమంది రీట్వీట్ చేశారు. నాలుగు వేలమందికి పైగా లైక్ కొట్టారు. సురీందర్ సింగ్ పాట సంగీత ప్రేమికులకు కొత్తేమీ కాదు. గత సంవత్సరం టివి షో ఇండియన్ ఐడల్ 10లో అతను పాల్గొన్నాడు.
వీడియో చూడండి
मैं एक दिन आऊंगा……जय हिंद??
Awesome voice of the @BSF_India solider.#FridayFeeling @gauravcsawant @majorgauravarya @DuttYogi @SunielVShetty @iamsunnydeol @TheSatishDua @atahasnain53 @AdityaRajKaul pic.twitter.com/YiXOlZowW8— Anita Chauhan (@anita_chauhan80) January 11, 2019