గుంటూరు, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో బ్రెజిల్ వ్యవసాయశాఖ మంత్రి టర్కీసియో క్రజ్ మెస్క్విటా భేటీ అయ్యారు. ఆదివారం చిలకలూరిపేటలో మంత్రి పుల్లారావును కలిసిన ఆయన బ్రెజిల్లో ఒంగోలు, ముర్రా జాతి ఆవుల, గెదేల అభివృద్ధి గురించి పుల్లారావుకు వివరించారు.
బ్రెజిల్లో మాదిరిగానే ఎపిలో కూడా ఒంగోలు జాతి పశు సంపదను పెంపొందించుకోవడంపై చర్చించామని ఈ సందర్భంగా మంత్రి పుల్లారావు తెలిపారు.
బ్రెజిల్ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంపై ముఖ్యమంత్రితో చర్చించి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం బ్రెజిల్లో 16 కోట్ల ఒంగోలు జాతి బ్రిడ్ ఉంది. అక్కడ ఒంగోలు జాతి ఆవులు, గెదేలు రోజుకు 45 లీటర్ల వరకు పాలు ఇస్తున్నాయని ఆయన అన్నారు.
బ్రెజిల్ కంటే ఎపిలో ఒంగోలు జాతి అభివృద్ది చాలా తక్కువగా ఉంది, మన ఒంగోలు జాతి ద్వారా బ్రెజిల్ ఏటా కోట్లాది ఆదాయాన్ని పొందుతుందనీ, బ్రెజిల్తో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అధిక పాల ఉత్పత్తి సాధించవచ్చని ఆయన తెలిపారు.
పశుసంపద అభివృద్ధి చెందినప్పుడే అర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది మంత్రి పేర్కొన్నారు.