రాష్ట్ర మాజీ ఎన్నికల ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. వీరి మీటింగ్ అనంతరం మళ్లీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నిమ్మగడ్డ బాధ్యతలు చేపడతారీ లేదో తేలిపోనుంది.
తనకు కనీస సమాచారం ఇవ్వకుండా స్థానిక ఎన్నికలను వాయిదా వేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే హుటాహుటిన ఒక ఆర్డినెన్స్ తీసుకొనివచ్చి నిమ్మగడ్డ పదవి కాలం తగ్గించి అతనిని తన పదవి నుండి తప్పించి విషయం తెలిసిందే.
అయితే హైకోర్టు మాత్రం తిరిగి నిమ్మగడ్డను స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. అది లెక్క చేయకుండా వారు సుప్రీం కోర్టు ని ఆశ్రయిస్తే…. సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. దీనితో హైకోర్టు ప్రభుత్వంతో పని కాదని వెళ్లి గవర్నర్ ను కలవమని నిమ్మగడ్డ కు సూచించింది.